News March 13, 2025

MHBD: ప్రేమగా మారిన మూగ పరిచయం

image

మూగవారే.. అయితేనేం. ప్రేమించుకున్నారు. వివాహంతో ఒక్కటయ్యారు. MHBD జిల్లా గార్ల మండలానికి చెందిన అశ్విన్‌సాయి, తూర్పుగోదావరి(ఏపీ) జిల్లాకు చెందిన బుజ్జి ఇద్దరు మూగవారే. రెండేళ్ల క్రితం ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా చిగురించింది. ఇంట్లో పెద్దలను ఒప్పించి బుధవారం గార్లలో వివాహం చేసుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Similar News

News December 1, 2025

ADB: గొంతు ఎత్తాలి.. నిధులు తేవాలి

image

పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఎంపీలైనా గోడం నగేశ్ గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడి నిధులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. బాసర ఆలయ అభివృద్ధి, ఆదిలాబాద్- ఆర్మూర్ రైల్వే లైన్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, సిర్పూర్, మంచిర్యాల రైల్వే లైన్‌లో కొత్త రైళ్ల రాకపోకలు, రైల్వే స్టేషన్లో అభివృద్ధిపై చర్చించాలి. పర్యాటక ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరాలి.

News December 1, 2025

జనగామ: ప్రచారానికి ఏడు రోజులే..!

image

గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగియడంతో సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థుల హడావుడి మొదలైంది. ప్రచారానికి ఈ నెల 3 నుంచి 10వ తేదీ వరకు 7 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఓట్ల కోసం పాట్లు పడుతున్నారు. నామినేషన్ల ఉప సంహరణ పూర్తయ్యాకే ప్రచారం నిర్వహిస్తారు. కానీ సమయం లేకపోవడంతో పట్టణాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన ఓటర్లకు ఫోన్లు చేసి ఓట్లు వేసి పోవాలని మచ్చిక చేసుకుంటున్నారు.

News December 1, 2025

గట్టు: బాండ్ పత్రంపై మేనిఫెస్టో విడుదల

image

గట్టు మండలం సల్కాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు చేసిన ప్రకటన జిల్లాలో చర్చనీయాంశమైంది. గ్రామ అభివృద్ధి కోసం ఏకంగా 22 అంశాలతో కూడిన మేనిఫెస్టోను ఆయన వంద రూపాయల బాండ్ పత్రంపై విడుదల చేశారు. తాను ఎన్నికైతే ఈ హామీలు నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పడం వైరల్ అయ్యింది.