News April 5, 2025
MHBD: భద్రాచలానికి RTC ప్రత్యేక బస్సులు

భద్రాచలంలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి మహబూబాబాద్ డిపో నుంచి 5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈనెల నెల 6వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లే మహబూబాబాద్ పరిసర ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News October 24, 2025
ఇంటర్వ్యూతో NIRDPRలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (NIRDPR) 9 పోస్టులను భర్తీ చేయనుంది. బీఈ/బీటెక్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్/ఎర్త్& ఎన్విరాన్మెంటల్ సైన్స్/ జియో ఇన్ఫర్మాటిక్స్/ పీహెచ్డీతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈ నెల 29న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్కు నెలకు రూ.లక్ష, రీసెర్చ్ అసోసియేట్కు రూ.50వేలు చెల్లిస్తారు. http://career.nirdpr.in
News October 24, 2025
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవకూడదా?

గరుడ పురాణంలో నరకం, పాపుల శిక్షల గురించి నిక్షిప్తంగా ఉంటుంది. ఇందులో ‘ప్రేతకల్పం’ ఉండటం వలన దీనిని ఇంట్లో చదవవచ్చా? లేదా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ పురాణాన్ని మిగిలిన పురాణాల మాదిరిగానే ఇంట్లో చదువొచ్చని పండితులు చెబుతున్నారు. ఇందులోని జ్ఞానం మనిషిని సత్కర్మల వైపు నడిపిస్తుందని అంటున్నారు. ఇతరులకు బహూకరించేటప్పుడు దీనిని హంస ప్రతిమతో ఇవ్వడం శుభప్రదమని సూచిస్తున్నారు.<<-se>>#DHARMASANDEHALU<<>>
News October 24, 2025
డ్రాయర్ల కంపెనీని వెళ్లగొట్టిన వ్యక్తి డేటా కంపెనీ తెచ్చాడట: సోమిరెడ్డి

AP: విశాఖకు తామే డేటా సెంటర్ తెచ్చామన్న YS జగన్ <<18081370>>కామెంట్లపై<<>> టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సెటైర్లు వేశారు. ‘డ్రాయర్ల కంపెనీని వెళ్లగొట్టిన వ్యక్తి డేటా కంపెనీ తెచ్చాడట. అప్పట్లో కియా తెచ్చింది తన తండ్రేనన్నాడు. ఇప్పుడు గూగుల్ తానే తెచ్చానంటున్నాడు. చెప్పుకోవడానికైనా సిగ్గుండాలి. ఇన్నాళ్లూ సగం పిచ్చోడనుకున్నాం… ఇప్పుడు పూర్తి పిచ్చోడని అర్థమైంది’ అని ట్వీట్ చేశారు.


