News April 5, 2025

MHBD: భద్రాచలానికి RTC ప్రత్యేక బస్సులు

image

భద్రాచలంలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి మహబూబాబాద్ డిపో నుంచి 5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈనెల నెల 6వ తేదీ ఉదయం 5 గంటల నుంచి  ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లే మహబూబాబాద్ పరిసర ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Similar News

News April 18, 2025

బెల్లంపల్లి: సమ్మర్ స్పెషల్ ట్రైన్ గడువు పొడిగింపు

image

ఎండా కాలం దృష్ట్యా ప్రవేశపెట్టిన సమ్మర్ స్పెషల్ ట్రైన్ దానాపూర్ ఎక్స్ ప్రెస్ రైలు గడువును రైల్వే శాఖ మరో ఐదు రోజులు పొడిగించింది. స్పెషల్ ట్రైన్ ప్రస్తుత కాలపరిమితి ఈ నెల 17 వరకు ఉండగా.. 28 వరకు పొడిగిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కాజీపేట్- బల్లార్షా సెక్షన్ పరిధిలోని కాజిపేట్, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్లార్షా జంక్షన్‌లో ఈ రైలు ఆగుతుంది.

News April 18, 2025

గర్భిణిని కాపాడిన ChatGPT

image

నార్త్ కరోలినాలోని(USA) షార్లెట్‌కు చెందిన నటాలియా టారియన్ అనే 8 నెలల గర్భిణికి ChatGPT చేసిన హెచ్చరిక ఆమె ప్రాణాలను కాపాడేలా చేసింది. తన దవడ బిగుతుగా అనిపిస్తోందని ఇందుకు కారణమేంటని నటారియా ChatGPTని అడగ్గా ఆమె బీపీని చెక్ చేసుకోవాలని తెలిపింది. బీపీ ఒక్కసారిగా పెరగడంతో వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయాలని Ai సూచించింది. ఆస్పత్రిలో బీపీ 200/146గా ఉండటంతో వెంటనే ప్రసవం చేసి తల్లీబిడ్డను కాపాడారు.

News April 18, 2025

సిట్ విచారణకు విజయసాయి హాజరు

image

AP: మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. కాసేపటి కిందటే విజయవాడలోని సిట్ ఆఫీసుకు చేరుకున్నారు. దీంతో ఆయన అధికారులకు ఏం చెప్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఈ స్కామ్‌కు కసిరెడ్డి రాజశేఖరే కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో ఈ కేసులో సాక్షిగా విచారించేందుకు ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చింది.

error: Content is protected !!