News July 12, 2024

MHBD: మంచం పడుతున్న ఏజెన్సీ ప్రాంతం!

image

MHBD జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన కొత్తగూడ, గంగారం, బయ్యారం మండలాల్లోని పలుగ్రామాల ప్రజలు విష జ్వరాలకు వణికిపోతున్నారు. ఇంటికొకరు మంచానికి పరిమితమం అవుతుండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏజెన్సీలో ఏ చిన్న జ్వరం వచ్చినా.. టౌన్‌కి రావాల్సి ఉండటంతో రాలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి గ్రామాలు, గూడేల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు.

Similar News

News November 4, 2025

వరద నష్టం నివేదిక తక్షణమే ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు, ఆస్తులు, మౌలిక సదుపాయాలకు జరిగిన నష్టాలను తక్షణం నమోదు చేసి నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో వరదల ప్రభావం, పునరుద్ధరణపై ఆమె సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ముంపు సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

News November 4, 2025

ఇంటర్ బోర్డు ఆదేశాలు తప్పనిసరి: డీఐఈఓ

image

ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల్లో బోర్డు ఆదేశాలను తప్పక పాటించాలని డీఐఈఓ శ్రీధర్ సుమన్ అన్నారు. ఆయన మంగళవారం పర్వతగిరి, నెక్కొండ కళాశాలలను సందర్శించి అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులు, వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధి, మానసిక వికాసానికి కృషి చేయాలని అధ్యాపకులకు సూచించారు.

News November 4, 2025

నేషనల్ హైవే భూసేకరణపై సమీక్ష

image

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే (ఎన్‌హెచ్ 163జీ) పనులకు సంబంధించి భూసేకరణ పురోగతిపై కలెక్టర్ డాక్టర్ సత్య శారద మంగళవారం సమీక్షించారు. మంచిర్యాల–వరంగల్–ఖమ్మం జిల్లాల మీదుగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 176.52 హెక్టార్లకు గాను 171.34 హెక్టార్ల భూసేకరణ పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన పెండింగ్ అవార్డులను నవంబర్ 10 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.