News March 13, 2025
MHBD: మటన్ కోసం మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్టు

మహబూబాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మటన్ కోసం భార్యను మర్డర్ చేసిన వ్యక్తిని సీరోల్ పోలీస్లు గురువారం అరెస్టు చేశారు. అనంతరం అతన్ని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా చూసుకునే బాధ్యత అందరి పైన ఉందని పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News October 16, 2025
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎస్పీ

పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం నగరంలోని చిన్నబజార్ పోలీసు స్టేషన్ను సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పచ్చదనం పెంచాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మహిళలు, బాలికలు తప్పిపోయిన కేసులలో తక్షణమే స్పందించి, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు.
News October 16, 2025
దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

గతేడాది దీపావళి సీజన్లో 10 గ్రాముల సిల్వర్ ధర రూ.1,100 ఉంటే ఈ ఏడాది అదే సమయానికి దాదాపు రెట్టింపయింది. ప్రపంచవ్యాప్తంగా వెండి కొరత, మైనింగ్ తగ్గడం తదితర కారణాలతో ప్రస్తుతం KG వెండి ధర రూ.2 లక్షలు దాటింది. అయితే పండగ తర్వాత ధరలు తగ్గొచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సప్లై పెరగడం, కీలక రంగాల మందగమనం, ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టడం వంటివి కారణాలుగా చెబుతున్నారు.
News October 16, 2025
టీటీడీ ఆలయానికి 20 ఎకరాల గుర్తింపు: కలెక్టర్

ఖమ్మం జిల్లాలో తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి స్థల అప్పగింత చర్యలు వెంటనే చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, తెలంగాణ దేవాదాయ శాఖ స్థపతి ఎన్.వాళ్లినాయగం, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డిలతో కలిసి సమీక్షించారు. అల్లీపురం వద్ద 20 ఎకరాల స్థలం గుర్తించి, తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి కేటాయించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.