News March 13, 2025

MHBD: మటన్ కోసం మర్డర్ చేసిన వ్యక్తిని అరెస్టు

image

మహబూబాబాద్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మటన్ కోసం భార్యను మర్డర్ చేసిన వ్యక్తిని సీరోల్ పోలీస్‌లు గురువారం అరెస్టు చేశారు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకుండా చూసుకునే బాధ్యత అందరి పైన ఉందని పోలీసులు పేర్కొన్నారు.

Similar News

News November 16, 2025

కడపలో రైలు ఢీకొని విద్యార్థి మృతి

image

కడప రైల్వే స్టేషన్‌లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని సతీశ్ (24) అనే బీటెక్ విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. సతీశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదవశాత్తూ మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలో అన్నమాచార్య కాలేజీలో బీటెక్ చదువుతున్నాడని వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు SI పేర్కొన్నారు.

News November 16, 2025

లోక్‌ అదాలత్‌లో 6,362 కేసుల పరిష్కారం: ఎస్పీ

image

జాతీయ మెగా లోక్‌ అదాలత్‌ ద్వారా జిల్లాలో రికార్డు స్థాయిలో పెండింగ్‌ కేసులను పరిష్కరించినట్లు నల్గొండ ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవా షెడ్యూల్ ప్రకారం నిర్వహించిన ఈ లోక్ అదాలత్‌లో మొత్తం 6,362 కేసులను రాజీ మార్గంలో పరిష్కరించామని ఆయన వెల్లడించారు. రాజీ మార్గమే రాజమార్గమని ఎస్పీ పేర్కొన్నారు.

News November 16, 2025

ఇల్లెందులో సేవలు మెరుగుపరుస్తాం: మంత్రి పొంగులేటి

image

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటనలో భాగంగా ఇల్లెందు ప్రభుత్వ ఆసుపత్రిని ఆదివారం సందర్శించారు. ఆసుపత్రి సేవలు బాగున్నాయని తన దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో సేవలు మరింతగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు. ఆసుపత్రికి కావాల్సిన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.