News February 7, 2025
MHBD: మిర్చి రైతుకు మిగిలిన కన్నీళ్లు..!
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా మిర్చి పంట వేయడానికి రైతులు మక్కువ చూపుతారు. ఎంతో కష్టపడి పండించిన మిర్చి పంటకు ఈ సంవత్సరం గిట్టుబాటు ధర రాక రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. గత సంవత్సరం గరిష్ఠంగా క్వింటా రూ.20- 23 వేల మధ్య ఉన్న ధర, ప్రస్తుతం రూ.12-14 వేలు చెల్లిస్తున్నారు. అయితే తెగుళ్ల కారణంగా పంట దిగుబడి తగ్గుతూ, మార్కెట్లో గిట్టుబాటు ధర లేక రైతులు మనోవేదనకు గురవుతున్నారు.
Similar News
News February 7, 2025
గుడ్లను ఇలా ఉడికిస్తున్నారా?
గుడ్డులో పోషకాలు, రంగు, రుచి ప్రత్యేకంగా ఉండాలంటే ఓ పద్ధతి ప్రకారం ఉడికించాలని US శాస్త్రవేత్తలు తెలిపారు. గుడ్డు సరిగ్గా ఉడకాలంటే ముందుగా మరుగుతున్న నీటిలో నుంచి గోరు వెచ్చని నీటిలోకి.. అలాగే గోరు వెచ్చని నీటిలో నుంచి మరుగుతున్న నీటిలోకి ప్రతి 2 నిమిషాలకు ఒకసారి మార్చాలి. ఇలా 32 నిమిషాలపాటు చేయాలి. ఆ తర్వాత చల్లని నీటిలో ఉంచి పెంకు తీయాలి. ఇలా చేస్తే గుడ్డులోని పోషకాలు సమతుల్యంగా లభిస్తాయి.
News February 7, 2025
కాలేజీలో నాపై ఎంతోమందికి క్రష్: రష్మిక
కళాశాలలో చాలామందికి తనపై క్రష్ ఉండేదని నేషనల్ క్రష్ రష్మిక మందన్న తెలిపారు. ఆ తర్వాత దేశం మొత్తానికి క్రష్గా మారానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘కిరిక్ పార్టీ(కన్నడ) సినిమా తర్వాత నేషనల్ క్రష్ ట్యాగ్ వచ్చింది. ఈ ట్యాగ్ దేశం మొత్తం పాకిపోయింది. ప్రస్తుతం దేశ ప్రజలందరూ నన్ను ప్రేమిస్తున్నారు. ఇది నాకు చాలా ప్రత్యేకంగా ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. రష్మిక కాలి గాయంతో బాధపడుతూ రెస్ట్ తీసుకుంటున్నారు.
News February 7, 2025
ఆదాయం ప్రకటించిన ఎల్ఐసీ
LIC ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.11,506 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతంతో పోలిస్తే 17 శాతం పెరిగినట్లు పేర్కొంది. ప్రీమియంల ద్వారా రూ.1,06,891 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ త్రైమాసికంలో మెుత్తంగా సంస్థ ఆదాయం రూ.2,01,994 కోట్లు కాగా గతంతో పోలిస్తే రూ.10,453 కోట్లు తగ్గినట్లు ప్రకటించింది. ఈ నష్టాలతోLIC షేరు 2.15శాతం తగ్గి రూ.811 వద్ద ముగిసింది.