News January 27, 2025

MHBD: మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులు

image

రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు నేటితో ముగిసింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీలకు ప్రత్యేక పాలనాధికారిగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్‌ను నియమించారు. కొత్త పాలకవర్గం కొలువు తీరేవరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని సర్కులర్ జారీ చేశారు.

Similar News

News October 28, 2025

నేటి ముఖ్యాంశాలు

image

* తుఫాను.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3వేలు
* రేపు రాత్రి కాకినాడ సమీపంలో తీరం తాకనున్న ‘మొంథా’ తుఫాన్
* జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నాలుగు రోజులు ప్రచారం చేయనున్న సీఎం రేవంత్
* పత్తి తేమ 12% దాటితే మద్దతు ధర రాకపోవచ్చు: తుమ్మల
* రెండో దశలో 12 చోట్ల SIR నిర్వహణ: CEC
* కోలుకుంటున్న టీమ్‌ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్

News October 28, 2025

GWL: భూ సమస్యల దరఖాస్తులు పరిష్కరించాలి

image

భూ సమస్యల దరఖాస్తులు పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని గద్వాల కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి మందిరంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ అలివేలుతో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో గద్వాల జిల్లా రాష్ట్రంలో 4వ స్థానంలో ఉందన్నారు. మిగిలిన దరఖాస్తులు వెంటనే పూర్తి చేసి రైతులకు న్యాయం చేయాలన్నారు. తహశీల్దార్లు పాల్గొన్నారు.

News October 28, 2025

లోకేశ్ ఆధ్వర్యంలో డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్

image

AP: డేటా సెంటర్ అడ్వైజరీ కౌన్సిల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2030 నాటికి 6వేల MW డేటా సామర్థ్యమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కౌన్సిల్‌ను మంత్రి నారా లోకేశ్ లీడ్ చేయనున్నారు. ఇందులో Microsoft Azure, Jio Platforms వంటి అంతర్జాతీయ కంపెనీలు, IIM విశాఖ, IIT తిరుపతి సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించారు. పెట్టుబడులు, అనుమతులు, నైపుణ్యాభివృద్ధి వంటి వాటిపై కౌన్సిల్ మార్గనిర్దేశం చేయనుంది.