News January 27, 2025
MHBD: మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులు

రాష్ట్రవ్యాప్తంగా పలు మున్సిపాలిటీ పాలకవర్గాల గడువు నేటితో ముగిసింది. మహబూబాబాద్ జిల్లా పరిధిలోని మహబూబాబాద్, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు మున్సిపాలిటీలకు ప్రత్యేక పాలనాధికారిగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ను నియమించారు. కొత్త పాలకవర్గం కొలువు తీరేవరకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుందని సర్కులర్ జారీ చేశారు.
Similar News
News January 8, 2026
చిత్తూరు: వైసీపీలో పలువురికి పదవులు

జిల్లాకు చెందిన పలువురిని వైసీపీలో వివిధ హోదాలలో నియమిస్తూ పార్టీ కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫక్రుద్దీన్(పుంగనూరు) మైనారిటీ సెల్ జోన్ 5 వర్కింగ్ ప్రెసిడెంట్, రవీంద్రనాథ్ రెడ్డి(చిత్తూరు) రాష్ట్ర లీగల్ జనరల్ సెక్రెటరీ, లీగల్ సెల్ అధికార ప్రతినిధులుగా రవీంద్ర(నగరి) సుగుణ శేఖర్ రెడ్డి(చిత్తూర్), జిల్లా ఉద్యోగులు, పింఛన్ వింగ్ అధ్యక్షుడిగా సోమచంద్రారెడ్డి(పలమనేరు)ను నియమించారు.
News January 8, 2026
గ్రోక్ వివాదం.. కేంద్రానికి ‘X’ నివేదిక

‘X’లో <<18744769>>అశ్లీల కంటెంట్<<>> అంశం కేంద్రానికి చేరిన విషయం తెలిసిందే. అలాంటి కంటెంట్ను తొలగించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తాజాగా బుధవారం సాయంత్రానికి ఎక్స్ తన రిపోర్టును సమర్పించింది. దీనిని ఐటీ శాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. Grokను దుర్వినియోగం చేసే యూజర్లపై కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే సదరు సంస్థ హెచ్చరించింది.
News January 8, 2026
తమిళనాడు-పుదుచ్చేరీ ఎన్నికల పరిశీలకుడిగా మంత్రి ఉత్తమ్

త్వరలో జరగనున్న తమిళనాడు-పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని నియమించినట్లు ఏఐసీసీ ప్రకటించింది. ఎన్నికల వ్యూహాలు, పార్టీ కార్యక్రమాల సమన్వయం, ప్రచార తీరును పర్యవేక్షించేందుకు ఆయన బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ నియామకంపై కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


