News April 8, 2025
MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.
Similar News
News February 25, 2026
ఫేక్ TTD వెబ్సైట్లపై పోలీసులకు ఫిర్యాదు

తిరుమలలో వసతి గదులు కల్పిస్తామంటూ నకిలీ వెబ్సైట్ల ద్వారా భక్తులను మోసం చేస్తున్న ఘటనలపై TTD అప్రమత్తమైంది. విజిలెన్స్ విచారణలో TTD పేరు, ఆలయ చిత్రాలను అనధికారికంగా ఉపయోగించి ఫేక్ వెబ్సైట్లు రూపొందించి ఆన్లైన్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలింది. దీంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు కాపీరైట్ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
News February 25, 2026
తిరుమలలో శ్రీవారి ధర్మ రథాలకు విశేష ఆదరణ

తిరుమలలో టీటీడీ నిర్వహిస్తున్న ఉచిత ఎలక్ట్రిక్ బస్సులకు డిజిటల్ డిస్ప్లే బోర్డుల ఏర్పాటుతో మరింత ఆదరణ లభిస్తోంది. 12 బస్సులు రోజుకు 300 ట్రిప్పులు నిర్వహిస్తూ సుమారు 60 వేల మంది భక్తులను రవాణా చేస్తున్నాయి. డిజిటల్ బోర్డులను B.S. Technotronics Private Limited విరాళంగా అందించగా, సాంకేతిక సహకారం Olectra Greentech Limited అందిస్తోంది. రాత్రివేళల్లో అదనంగా 20 ట్రిప్పులు పెంచనున్నారు.
News February 25, 2026
ఎచ్చెర్ల: డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల..

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్ను డీన్ డా.అనురాధ విడుదల చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎటువంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్న్ షిప్, వైవా మార్చి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు.


