News October 29, 2025
MHBD: ‘అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలి’

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను (7995074803) ఏర్పాటుచేసినట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అత్యవసరమైన పరిస్థితి ఏర్పడినా ఈ నంబర్ను సంప్రదించాలని సూచించారు. కంట్రోల్ రూమ్ నందు సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News October 29, 2025
NTR: సెలవులపై క్లారిటీ ఇచ్చిన డీఈవో

ఎన్టీఆర్ జిల్లాలోని విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశం అవాస్తవమని డీఈవో సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రధానోపాధ్యాయులు అధికారికంగా విడుదల కాని సమాచారాన్ని నమ్మకూడదని, ప్రచారం చేయకూడదని కోరారు. ఏదైనా సమాచారం ఉంటే కార్యాలయం మాత్రమే అధికారిక సందేశాలను విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.
News October 29, 2025
దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News October 29, 2025
గుండ్లకమ్మలో పడవ బోల్తా.. సిబ్బంది సేఫ్

అద్దంకి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు ముగ్గురు గుండ్లకమ్మ నదిలో పంపు హౌస్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని రక్షించేందుకు మూడు గంటల నుంచి అధికారులు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్లని బయటికి తీసుకొచ్చేందుకు నదిలోకి పడవను పంపించారు. ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడటంతో అందులో ఉన్న ఆరుగురు సిబ్బంది ప్రాణాపాయం నుంచి తప్పించుకొని చెట్లు ఎక్కారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


