News January 31, 2025
MHBD: కూతురి పెళ్లి కోసం దాచుకున్న నగదు చోరీ

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మోద్గులగూడెం శివారు బేగావతు తండాలో భారీ చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వీరన్న ఇంట్లో కూతురి పెళ్లి కోసం దాచుకున్న రూ.9 లక్షల నగదు దోచుకుపోయారని బాధితులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న సీరోలు ఎస్సై సీహెచ్ నగేశ్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
Similar News
News February 26, 2026
కడప: ఇవాళ పరీక్షకు 466 మంది గైర్హాజర్.!

కడప జిల్లాలో గురువారం 62 సెంటర్లలో ఇంటర్ 2nd ఇయర్ ఇంగ్లిష్ పరీక్షలు జరిగాయి. నేడు 16,861 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 16,395 మంది మాత్రమే రాశారు. 466 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థుల్లో 15,792 మంది రాయాల్సి ఉండగా.. 15,300 మంది రాశారు. 402 మంది ఆబ్సెంట్ అయ్యారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 1,159 మంది రాయాల్సి ఉండగా.. 1,095 మంది రాశారు. 64 మంది రాయలేదు.
News February 26, 2026
ఏలూరు జిల్లాలో ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఒకరోజు ముందుగానే, ఈనెల 28వ తేదీన పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపారు. శనివారం ఉదయం 7 గంటల నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. మార్చి నెలకు సంబంధించి జిల్లాలో 2,57,658 మంది లబ్ధిదారులకు రూ.113.09 కోట్లు అందజేస్తున్నామని, శనివారమే వంద శాతం పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.
News February 26, 2026
విశాఖ వేదికగా దక్షిణాది ఎమ్మెల్యేల క్రీడా పోటీలు: స్పీకర్

విశాఖ వేదికగా దక్షిణాది 6 రాష్ట్రాల ఎమ్మెల్యేల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల ఎమ్మెల్యేలను ఆహ్వానించి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విశాఖ బీచ్ వాలీబాల్, కబడ్డీకి అనుకూలమన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.


