News July 7, 2025

MHBD, కేసముద్రానికి డిప్యూటీ సీఎం, మంత్రులు రాక

image

ఈనెల 8న మహబూబాబాద్, కేసముద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు MLA మురళీ నాయక్ తెలిపారు. రూ.300 కోట్ల పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనల కార్యక్రమానికి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, సీతక్క, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వేం నరేందర్ రెడ్డిలు హాజరు కానునట్లు తెలిపారు. సభకు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు.

Similar News

News July 7, 2025

అందుకే ఇన్నింగ్స్ డిక్లేర్ చేశా: ముల్డర్

image

జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్టులో 400 కొట్టి లారా రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉన్నా SA కెప్టెన్ ముల్డర్(367*) ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే. దాని వెనుకున్న కారణాన్ని ఆయన బయటపెట్టారు. ‘గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాం. లారా ఒక లెజెండ్. ఆ రికార్డు అలాగే ఉండేందుకు ఆయన అర్హులు. మళ్లీ ఛాన్స్ వచ్చినా ఇదే నిర్ణయం తీసుకుంటా. కోచ్ శుక్రీ కూడా ఇదే అన్నారు’ అని వ్యాఖ్యానించారు.

News July 7, 2025

మెదక్: ‘రైతులను ఆదుకోవాలి’

image

రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులకు న్యాయం చేయాలని రైతు రక్షణ సమితి సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ రాజ్‌కు రైతు సమస్యలపై రైతు రక్షణ సమితి సభ్యులు వినతిపత్రం అందించారు. అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోతున్నారని, ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

News July 7, 2025

విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు

image

కోటబొమ్మాలి రైల్వే లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు నేపథ్యంలో విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తే డివిజన్ డీసీఎం సందీప్ సోమవారం తెలిపారు. విశాఖ -గుణుపూర్ (58505/06), విశాఖ -బరంపూర్ (58531/32), విశాఖ -భువనేశ్వర్ ఇంటర్ సిటీ (22819/20), విశాఖ- పలాస ప్యాసింజర్ (67289/90), విశాఖ -బరంపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/26) రైళ్ళు జూలై 11న రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.