News March 14, 2025
MHBD: కొడుకుతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళ

మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాకు చెందిన భూక్యా శ్రీలతకు ఆమె భర్త మోతిలాల్కు మార్చి 4వ తేదీన వాగ్వాదం జరిగింది. అదే రోజు రాత్రి ఇంటి నుంచి తన కొడుకు వినయ్ని తీసుకొని శ్రీలత బయటకు వెళ్ళిపోయింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఇళ్లు, ఇతర చోట్ల వెతికారు. కాని ఆచూకీ లేకపోవడంతో తల్లి ఇస్లావత్ కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కురవి SI సతీష్ తెలిపారు.
Similar News
News April 5, 2026
NLG: ఫ్రిడ్జ్ పేలకూడదంటే.. ఈ జాగ్రత్తలు మరువొద్దు

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల రిఫ్రిజిరేటర్లు పేలుతున్న <<19570386>>ఘటన<<>>లు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటిని నివారించాలంటే ఫ్రిడ్జ్ను గోడకు ఆనించకుండా గాలి ఆడేలా కనీసం అడుగు దూరం ఉంచాలి. దీనివల్ల కంప్రెసర్ వేడి బయటకు పోతుంది. వోల్టేజ్ హెచ్చుతగ్గుల నుంచి రక్షణకు నాణ్యమైన స్టెబిలైజర్ వాడాలి. ఫ్రిడ్జ్లో పరిమితికి మించి వస్తువులను కుక్కకూడదు. ఇబ్బందులుంటే మెకానిక్తో తనిఖీ చేయిస్తే ప్రమాదాలను నివారించవచ్చు.
News April 5, 2026
నల్గొండ: గంజాయి మత్తులో లేత ప్రాయం..!

ఉమ్మడి జిల్లాలో గంజాయి కేసుల్లో 14 నుంచి 18 ఏళ్ల వారే ఎక్కువగా పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతులు మత్తు వైపు వెళ్తుండటం కంటతడి పెట్టిస్తోంది. భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన లేత వయసులో పిల్లలు జైళ్ల పాలవుతున్నారు. పిల్లల ప్రవర్తనలో మార్పులను తల్లిదండ్రులు పసిగట్టాలి. వారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా చూస్తూ, ప్రేమగా కౌన్సెలింగ్ ఇప్పించి సన్మార్గంలో నడిపించాలి.
News April 5, 2026
వారంలో బంగారం ధర ఎంత పెరిగిందంటే?

వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. మార్చి 27వ తేదీ నుంచి 10గ్రా. 24 క్యారెట్ల బంగారంపై రూ.5,350 పెరిగింది. 22 క్యారెట్లపై రూ.4,900 పెరుగుదల నమోదైంది. APR 2న మాత్రమే తగ్గుదల కన్పించింది. పశ్చిమాసియా యుద్ధం, ట్రంప్ ప్రకటనలతో స్టాక్ మార్కెట్ల అనిశ్చితి వల్ల బులియన్ మార్కెట్పైనా ప్రభావం పడుతోంది. ప్రస్తుతం HYDలో 24 క్యారెట్ల పసిడి 1,50,930, 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,38,350గా ఉంది.


