News April 8, 2025

MHBD: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు దరఖాస్తులు ఆహ్వానం

image

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మహాబూబాబాద్
జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఎం.నరసింహస్వామి నేడు ఒకప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడుతూ.. 2024-25వ సంత్సరానికి గాను జిల్లాలో చదువుతున్న(SC/ST/BC/OC/EBC) విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కొరకు మార్చి చివరిలోపు www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News April 17, 2025

ధర్మవరం రూట్‌లో పనులు.. పలు రైళ్లు రద్దు

image

ధర్మవరం రైల్వే స్టేషన్‌లో పుట్టపుర్తి-తిరుపతి కనెక్షన్ పాయింట్స్, పాయింట్ ఛేంజింగ్ పనులు బుధవారం మొదలయ్యాయి. దీంతో గుంతకల్లు-తిరుపతి, తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజర్ రైళ్లు బుధవారం నుంచి మే 17వరకు రద్దయ్యాయి. ఈ మార్గంలో వెళ్లే మరిన్ని రైళ్లను గుత్తి మీదుగా రేణిగుంటకు మళ్లించారు. ఇక నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ కదిరి-నర్సాపూర్‌ మధ్య రాకపోకలు సాగించనుంది.

News April 17, 2025

సోషల్ మీడియాలో పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు: సీఐ

image

మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా ఎక్స్‌ (ట్విట్టర్‌) పోస్ట్ పెట్టిన వైసీపీ నాయకుడిపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె రెండవ పట్టణ సీఐ రామచంద్ర తెలిపారు. మదనపల్లె‌లోని శివాజీ నగర్‌లో ఉండే మహబూబ్ ఖాన్ ఫిర్యాదు మేరకు ఎక్స్‌లో అసభ్య పదజాలంతో పోస్టులు పెట్టిన వైసీపీ నేతపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

News April 17, 2025

గిన్నిస్ బుక్‌లో స్థానం సాధించిన కర్లపాలెం విద్యార్థి

image

బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం బిడారుదిబ్బ గ్రామానికి చెందిన కే జోయెల్ విల్సన్ సంగీతంలో వరల్డ్ రికార్డుతో పాటు గిన్నిస్ బుక్‌లో పేరు సంపాదించాడు. గత 6 నెలల వ్యవధి కాలంలో అగస్టీన్ దండంగి సారధ్యంలో సంగీతం (కీబోర్డ్) లో మెలకువలు నేర్చుకున్నాడు. ప్రపంచంలో 18 దేశాల నుంచి 1046 మంది సంగీత విధ్వాంసులతో సంగీతం ప్లే చేసి గిన్నిస్ బుక్‌లో స్థానం సాదించుకున్నాడు. ఈ సందర్భంగా పలువురు అతనిని అభినందించారు.

error: Content is protected !!