News September 14, 2025
MHBD: ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్

రేపు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆదివారం తెలిపారు. జిల్లాస్థాయి అధికారులందరూ యూరియా పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News September 14, 2025
పార్వతీపురం: రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు ఎంపిక

పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ స్థానిక గవర్నమెంట్ హై స్కూల్లో జూనియర్ కబడ్డీ విభాగంలో ఎంపికలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పాల్గొన్న క్రీడాకారుల్లో 14 మంది బాలికలు,14 మంది బాలురు ఎంపిక అయ్యారని, వీరందరూ ఈనెల 24 నుంచి 28 వరకు NTR జిల్లా గొల్లపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని జిల్లా కబడ్డీ సంఘం సెక్రటరీ వెన్నపు చంద్రరావు తెలిపారు.
News September 14, 2025
భారత్-పాక్ మ్యాచ్: షేక్ హ్యాండ్ ఇచ్చుకోని కెప్టెన్లు

ఆసియాకప్లో భారత్, పాక్ మ్యాచ్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు సూర్య, సల్మాన్ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. టాస్ సమయంలో కనీసం పలకరించుకోకపోగా షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. ఇప్పటికే పాక్తో మ్యాచ్ ఆడొద్దని ఇండియన్ ఫ్యాన్స్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
News September 14, 2025
గచ్చిబౌలిలో గోడ కూలి ఒకరు మృతి.. నలుగురికి గాయాలు

గచ్చిబౌలి పీఎస్ పరిధిలోని వట్టినాగులపల్లిలో ప్రమాదం జరిగింది. గోడ కూలి ఒకరు మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. స్థానికంగా కొత్తగా నిర్మిస్తున్న నూతన కన్వెన్షన్ సెంటర్కి చెందిన ప్రహరీ కూలి అక్కడే పని చేస్తున్న కూలీలపై పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.