News March 14, 2025
MHBD: బైకులో పాము కలకలం (PHOTO)

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండల కేంద్రంలోని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శివాజీ బైక్లో పాము చేరింది. శివాజీ విధులు నిర్వహిస్తున్న సమయంలో బైక్లో పాము దూరింది. వెంటనే పైకి లేవగా, అప్రమత్తమైన అధికారి బైక్ను పక్కకు నిలిపాడు. సుమారు 2 గంటల తర్వాత పాము కిందకు దిగివెళ్లిపోవడంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.
Similar News
News February 22, 2026
నో హెల్మెట్ – నో పెట్రోల్.. యాదాద్రి కలెక్టర్ ఆదేశం

భువనగిరి జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు కలెక్టర్ హనుమంతరావు కఠిన నిబంధనలు అమలులోకి తెచ్చారు. ఇకపై హెల్మెట్ లేని బైక్లకు పెట్రోల్ పోయకూడదని బంక్ యాజమాన్యాలను ఆదేశించారు. ప్రతి బంక్ వద్ద హెల్మెట్ ఆవశ్యకతపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటించి సహకరించాలని కోరారు.
News February 22, 2026
USతో ట్రేడ్ డీల్పై చర్చలు వాయిదా

అమెరికాతో భారత్ ట్రేడ్ డీల్పై జరగాల్సిన చర్చలు వాయిదా పడినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుంచి మూడు రోజుల పాటు చర్చలు జరగాల్సి ఉంది. అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ టారిఫ్స్ను కొట్టివేసిన నేపథ్యంలో ఈ వాయిదా చర్చనీయాంశమైంది. మారిన పరిణామాలను పరిశీలించి మళ్లీ చర్చించేందుకు ఇరు పక్షాలు అంగీకరించినట్లు సమాచారం. కాగా FEB 24 నుంచి 150 రోజుల పాటు 15% టారిఫ్స్ అమలవుతాయని ట్రంప్ ప్రకటించారు.
News February 22, 2026
ఖమ్మం: ఈ నెల 24న లబ్ధిదారుల ఎంపిక

ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పథకాలకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 24న నిర్వహించనున్నట్లు కేఎంసీ డిప్యూటీ కమిషనర్ కె.శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఉదయం 11గంటలకు డ్రా పద్ధతిలో ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న మైనార్టీ మహిళలు తమ వెంట ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో నిర్ణీత సమయానికి హాజరు కావాలని ఆయన సూచించారు.


