News April 5, 2025
MHBD: భద్రాచలానికి RTC ప్రత్యేక బస్సులు

భద్రాచలంలో జరుగు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి మహబూబాబాద్ డిపో నుంచి 5 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం శివప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈనెల నెల 6వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఎక్స్ ప్రెస్ బస్సు సర్వీసులు నడుస్తాయన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి వెళ్లే మహబూబాబాద్ పరిసర ప్రజలు, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Similar News
News December 25, 2025
విజయనగరం: విద్యార్థి ఆత్మహత్యకు కారణమేంటో?

విజయనగరంలోని స్థానిక వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్ కళాశాల విద్యార్థి కూనేటి మహేష్(24) ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. రీడింగ్ రూమ్లో ఉరి వేసుకుని చనిపోయే ముందు మహేశ్ రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో అమ్మ, అన్నయ్య నన్ను క్షమించండి.. నేను చనిపోతున్నా అని పేర్కొన్నాడు. అయితే తన ఆత్మహత్యకు నిర్దిష్ట కారణాన్ని లెటర్లో పేర్కొనలేనది పోలీసులు తెలిపారు.
News December 25, 2025
తెగుళ్ల నుంచి పంట సహజ రక్షణకు సూచనలు

ఏటా అదే భూమిలో ఒకే రకం పంటను వేయకుండా.. పెసర, మినప, అలసంద, మొక్కజొన్న, బంతి వంటి పంటలతో పంటమార్పిడి చేయాలి. ఒకే పంట సాగు వల్ల గత పంటను ఆశించిన చీడపీడలు, తిరిగి కొత్తగా నాటిన అదే పంటను ఆశించి నష్టపరుస్తాయి. పంట మార్పిడి వల్ల ఈ ప్రమాదం తప్పుతుంది. విత్తడానికి ముందు సాగు భూమిని బాగా దుక్కి చేసి ఉంచితే సూర్యరశ్మి వల్ల భూమిలో దాగిన శిలీంధ్రాలు, హానికలిగించే పురుగుల ప్యూపాలు నశిస్తాయి.
News December 25, 2025
ప్రోటోకాల్ రగడ.. ఎమ్మెల్యే కవ్వంపల్లికి వరుస అవమానాలు

KNR(D)లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో MLA కవ్వంపల్లి సత్యనారాయణను విస్మరిస్తూ తరచూ ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోంది. నిన్న మైనారిటీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆహ్వానం అందకపోవడం, ఫ్లెక్సీల్లో ఫోటో లేకపోవడం వివాదాస్పదమైంది. గతంలో సన్నబియ్యం పంపిణీ, గణేశ్ మండపాల విద్యుత్ ఫ్లెక్సీల్లోనూ ఇదేతీరు పునరావృతమైంది. అధికారుల వివక్షపై కాంగ్రెస్ శ్రేణులు కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి.


