News August 17, 2025

MHBD: భారీ వర్షాలు.. ఉన్నత స్థాయి సమీక్ష!

image

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో MHBD జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి సీతక్క నేడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల జిల్లాలోని లో లెవల్ వంతెనలపై వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయన్నారు. దీంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎమ్మెల్యేలు రాం చంద్రు నాయక్, మురళీ నాయక్, ఇంచార్జ్ కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News August 18, 2025

తిరుమలలో గందరగోళం జరగలేదు: TTD

image

తిరుమల క్యూలో గందరగోళం జరిగినట్లు వస్తున్న వార్తలను TTD ఖండించింది. వైరల్ అవుతోన్న వీడియో తోపులాటకు సంబంధించినది కాదని స్పష్టం చేసింది. భక్తులను సమూహాలుగా విభజించి తాళ్ల సాయంతో క్రమబద్ధీకరిస్తుండగా కొందరు ఉత్సాహంతో ముందుకు కదిలారని.. దాన్ని తోపులాట అని తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలిపింది. గత 3 రోజుల్లో 2.5 లక్షల మంది ఎలాంటి అంతరాయం లేకుండా స్వామివారిని దర్శించుకున్నారని వివరించింది.

News August 18, 2025

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

✓రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: కలెక్టర్ జితేష్ వి పాటిల్
✓పాల్వంచ బస్టాండ్ ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కూనంనేని
✓Way2News కథనానికి స్పందన.. సారపాకలో రోడ్లకు మరమ్మతులు
✓మణుగూరులో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీ కొట్టిన డీసీఎం
✓భద్రాద్రి రామాలయంలో అన్నదానానికి రూ.లక్ష విరాళం
✓సీపీఐ నేత అయోధ్య సంస్మరణ సభలో కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే పాయం
✓పోలవరం బ్యాక్ వాటర్‌తో భద్రాచలానికి ముప్పు: సీపీఎం

News August 18, 2025

కాచాపూర్‌: బావిలో దూకి మహిళ ఆత్మహత్య

image

వ్యవసాయ బావిలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శంకరపట్నం మండలం కాచాపూర్‌లో జరిగింది. పోలీసులు ప్రకారం.. గ్రామానికి చెందిన అబ్బు శకుంతల (58) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే మతిస్థిమితం కూడా కోల్పోయి ఆదివారం తెల్లవారుజామున వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త సత్యనారాయణ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.