News April 8, 2025

MHBD: యువకుడి మృతి.. జ్ఞాపకంగా విగ్రహావిష్కరణ

image

మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కాంపల్లి గ్రామానికి చెందిన రేపాల భిక్షపతి అనే యువకుడు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అందరితో కలిసి మెలిసి ఉండే భిక్షపతి చిన్న వయసులోనే మృతి చెందడంతో గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యుల జ్ఞాపకంగా సోమవారం అతడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. దీంతో పలువురు వారిని అభినందించారు.

Similar News

News November 10, 2025

వనపర్తి: రేటినో స్కోపి పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభం

image

వనపర్తి జిల్లాలో వైద్య శాఖ ద్వారా గుర్తించిన మధుమేహ వ్యాధిగ్రస్తుల ప్రతి ఒక్కరికి రేటినో స్కోపి పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ తన ఛాంబర్‌లో వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు రెటినోపతి వైద్య పరీక్షలు ఈనెల 14 నుంచి ప్రారంభించి 100 రోజుల్లో పూర్తి చేయాలన్నారు.  

News November 10, 2025

కరీంనగర్: చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి చికిత్స పొందుతూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. గత రాత్రి సుల్తానాబాద్‌లో గుర్తుతెలియని వాహనం ఢీ కొనగా.. 108 వాహనం ద్వారా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతిచెందిన వ్యక్తి వివరాలు తెలియలేదని, ఎవరైనా గుర్తుపడితే తమను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

News November 10, 2025

ములుగు: ఎలుకల మందు తాగి మహిళ సూసైడ్

image

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నర్సాపూర్ గ్రామంలో ఎలుకల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త అటికే పరమేష్ రూ.3 వేల ఆన్‌లైన్ షాపింగ్ చేయగా, భార్య దివ్య అతడిని మందలించింది. అనంతరం భర్త పని నిమిత్తం బయటకు వెళ్లగా దివ్య ఇంట్లో ఉన్న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.