News October 28, 2025
MHBD: రాయుతీపై వ్యవసాయ పనిముట్లు: DAO

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వ్యవసాయ శాఖలో సబ్ మిషన్ అన్ ఆగ్రికల్చర్ మెకనైజేషన్ పథకం ద్వారా సబ్సిడీలో వ్యవసాయ పనిముట్లు అందుబాటులో ఉన్నాయని MHBD DAO విజయ నిర్మల అన్నారు. ఇందులో బ్యాటరీ స్ప్రేయర్లు 2496, పవర్ స్ప్రేయర్లు452, రోటవేటర్లు 178, సీడ్ కం ఫర్టి డ్రిల్స్ 36, డిస్క్ హరో/కల్టివేటర్స్/కేజ్ వీల్స్/MB ప్లవ్స్ 222, బండ్ ఫార్మర్స్ 9, పవర్ వీడర్స్ 17, బ్రష్ కట్టర్స్ 33 పవర్ టిల్లర్స్ ఉన్నాయి.
Similar News
News October 29, 2025
సూర్యాపేట: భారీ వర్షాలు.. కంట్రోల్ రూం ఏర్పాటు

మోంథా తుపాను నేపథ్యంలో కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే 62814 92368 నంబర్కు కాల్ చేయాలన్నారు. కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. అదేవిధంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
News October 29, 2025
NGKL: భారీ వర్షాలు… జూనియర్ కళాశాలలకు నేడు సెలవు

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, జిల్లా కేంద్రంలో రెడ్ అలర్ట్ ఉన్నందున కలెక్టర్ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు డీఐఈవో వెంకటరమణ తెలిపారు. నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఈ సెలవుకు బదులుగా రాబోయే రెండవ శనివారం రోజున కళాశాలలు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
News October 29, 2025
సంగారెడ్డి: ఫ్యామిలీ గ్రూపులో మెసేజ్ పెట్టి భర్త అదృశ్యం

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీకి చెందిన శ్రీధర్(24)కు నాలుగేళ్ల క్రితం గీతతో వివాహమైంది. కాగా ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో పెద్దల మధ్య పంచాయితీ పెట్టి ఇరువురికి నచ్చజెప్పారు. అనంతరం స్కూటీపై ఇంటికి వెళ్లిన భర్త తిరిగి రాలేదు. ఫ్యామిలీ వాట్సప్ గ్రూప్లో తన చావుకు కారణం భార్య అని మెసేజ్ పెట్టాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.


