News April 16, 2025
MHBD: రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ అనే ప్రచారం.. పౌర సరఫరాల శాఖ క్లారిటీ

రేషన్ షాపుల్లో ప్లాస్టిక్ రైస్ అనే ప్రచారం అబద్ధమని మహబూబాబాద్ జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి ప్రేమ్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రేషన్ షాపుల్లో పంపిణీచేసే సన్న బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం అంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని, ప్రజలు ఈ పుకార్లు నమ్మవద్దన్నారు. ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారులందరికీ నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేస్తుందన్నారు.
Similar News
News February 15, 2026
ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు.. PTI ఆందోళన

అవినీతి కేసుల్లో జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ <<19124142>>తీవ్ర అనారోగ్యంతో<<>> బాధపడుతున్నట్లు PTI పార్టీ తెలిపింది. దీంతో అధికారులు ఆయనను జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలిస్తున్నారని, ఇది ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ఆరోపించింది. ఆయన ఫ్యామిలీ మెంబర్, పర్సనల్ డాక్టర్ల సమక్షంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యం గురించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరింది.
News February 15, 2026
రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ రద్దు: అనకాపల్లి కలెక్టర్

మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 16వ తేదీన నిర్వహించాల్సిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఐచ్ఛిక సెలవు దినం ప్రకటించడంతో కలెక్టరేట్తో పాటు మున్సిపల్, డివిజన్, మండల స్థాయిలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమాలను రద్దు చేస్తున్నామన్నారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
News February 15, 2026
నమీబియాపై USA గెలుపు

T20WC: చెన్నైలో నమీబియాతో జరిగిన మ్యాచ్లో USA 31 పరుగులతో విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఆరంభంలో ధనాధన్ బ్యాటింగ్ చేసింది. 10 ఓవర్ల వరకు 9కి పైగానే రన్రేట్ మెయింటేన్ చేసింది. ఆపై వరుసగా వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. చివరకు 6 వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద ఆగిపోయింది. ఈ ఓటమితో నమీబియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.


