News April 3, 2025

MHBD: హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

MHBDలో జరిగిన <<15975323>>హత్య<<>> కేసును పోలీసులు చేధించారు. SP సుదీర్ రామ్నాథ్ వివరాలు.. పార్థసారథి అతడి భార్య స్వప్న మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈక్రమంలో స్వప్న ఆమె ప్రియుడు విద్యాసాగర్‌తో కలిసి నలుగురు దుండగులకు రూ.5లక్షలు సుపారి ఇచ్చి మంగళవారం దంతలపల్లికి డ్యూటీకి వెళ్తున్న పార్థసారథిని హత్య చేయించింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్వప్న, విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. కాగా హత్య చేసిన నలుగురు పరారీలో ఉన్నారు.

Similar News

News March 1, 2026

కర్నూలు: మత్తు పదార్థాలపై ఉక్కుపాదం.. కలెక్టర్ ఆదేశం!

image

కర్నూలు జిల్లాలో మత్తు పదార్థాల రవాణా, వినియోగాన్ని అరికట్టాలని కలెక్టర్ డా.ఏ సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని NCORD సమావేశంలో మాట్లాడుతూ.. విద్యాసంస్థల వద్ద నిఘా పెంచాలని, RTC బస్సుల్లో అక్రమ రవాణా జరగకుండా చూడాలన్నారు. జనవరి నుంచి జిల్లాలో 2 కేసులు నమోదు చేసి 1.350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి సాగుపై నిఘా ఉంచాలని రెవెన్యూ, పోలీసు శాఖలను కలెక్టర్ ఆదేశించారు.

News March 1, 2026

దౌత్యమే కాపాడింది.. ఆ ఒక్క గల్ఫ్ దేశం సేఫ్!

image

US, ఇజ్రాయెల్‌‌పై ప్రతీకార దాడుల్లో భాగంగా గల్ఫ్ దేశాలపైన విరుచుకుపడుతున్న ఇరాన్ ఒమన్‌ను మాత్రం విడిచిపెట్టింది. దౌత్యంలో US, ఇరాన్‌లకు ఒమన్ సమాన ప్రాధాన్యం ఇవ్వడమే కారణం. గతంలో పలు సందర్భాల్లో ఇరు దేశాలకు ఒమన్ మధ్యవర్తిగా పనిచేసింది. దీంతో పాటు ఒమన్‌‌లో US స్థావరం లేదు. మరోవైపు బహ్రయిన్, కువైట్, ఖతార్, UAE, సౌదీ USకు మద్దతు ఇస్తున్నాయి. కాగా ఒమన్‌లో దాదాపు 9లక్షల మంది భారతీయులు ఉన్నారు.

News March 1, 2026

బిచ్కుంద: 24 గంటల్లోనే హత్య కేసు నిందితుడి అరెస్ట్

image

భూ తగాదాల నేపథ్యంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. బిచ్కుంద CI రవి తెలిపిన వివరాలు.. బిచ్కుందకు చెందిన సాయిలు, అతని సోదరుడు నారాయణ మధ్య కొంతకాలంగా భూ వివాదాలు నడుస్తున్నాయి. ఆగ్రహానికి లోనైన నారాయణ సాయిలు తలపై కర్రతో బలంగా బాదాడు. తీవ్ర గాయాలైన సాయిలు అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడు నారాయణను పట్టుకొని, హత్యకు వాడిన కర్రను స్వాధీనం చేసుకున్నట్లు CI వెల్లడించారు. SI రాజు ఉన్నారు.