News April 13, 2025
MHBD : BRS సిద్ధమా.. పూర్వవైభవం వచ్చేనా..?

రాష్ట్రంలో పదవి కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ శ్రేణులతో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు శంకర్నాయక్, రెడ్యానాయక్ దిశానిర్దేశం చేశారు. సభతో BRSలో జోష్ వస్తే పార్టీకి పూర్వ వైభవం వస్తుందని వారు ఆశిస్తున్నారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై ఏ మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి మరి.
Similar News
News April 14, 2025
ఎలక్ట్రానిక్ వస్తువులపై US కొత్త టారిఫ్లు?

US అధ్యక్షుడు ట్రంప్ ఎలక్ట్రానిక్ వస్తువులపై ఇచ్చిన టారిఫ్ల మినహాయింపు కొద్ది రోజులే అని తెలుస్తోంది. త్వరలోనే వాటితో పాటు ఔషధాలపైనా టారిఫ్ బాంబ్ పేల్చనున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు తదితర వస్తువులు ప్రత్యేక సుంకాల పరిధిలోకి వస్తాయని ఆ దేశ వాణిజ్యశాఖ మంత్రి హోవార్డ్ వెల్లడించినట్లు తెలిపింది. 2 నెలల్లో కొత్త సుంకాలు విధించనున్నట్లు వివరించింది.
News April 14, 2025
సిద్దిపేట: సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టవద్దు: సీపీ

సోషల్ మీడియాలో విద్వేషకర, తప్పుడు పోస్టులు, మార్ఫింగ్ చేసి ఫోటోలు, రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పోస్టులు పెట్టే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ డాక్టర్ బి.అనురాధ హెచ్చరించారు. IT చట్ట ప్రకారం కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు, యువకులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు SMలో తప్పుడు పోస్టులు పెట్టవద్దన్నారు.
News April 14, 2025
ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా ఆర్సీబీ!

IPL 2025లో RCB తన ప్రత్యర్థులను సొంత మైదానాల్లోనే ఓడించి వారి పాలిట సింహస్వప్నంలా మారింది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఈడెన్లో KKR, చెపాక్లో CSK, వాంఖడేలో MI, జైపూర్లో RRను మట్టికరిపించింది. అన్ని విభాగాల్లో రాణిస్తూ తమకు ఎదురే లేకుండా నిలుస్తోంది. కానీ తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో మాత్రం ఆర్సీబీ ఇంకా ఖాతా తెరవకపోవడం విశేషం. అక్కడ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది.