News February 11, 2025
MHBD: అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠినచర్యలు : SP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739270374440_50007403-normal-WIFI.webp)
మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామానాథ్ కేకన్ ఆకేరు నది పరివాహక ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. ఇసుకను అక్రమరవాణా చేస్తున్నారని చాలా ఫిర్యాదులు వస్తున్నాయని క్షేత్రస్థాయిలో పర్యటించామన్నారు. ఇక నుంచి అనుమతులు లేకుండా ఎవరు కూడా ఇసుకను తరలించకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News February 12, 2025
KNR: కెనాల్ కాలువలో ఈతకు వెళ్లి ఒకరు మృతి, మరొకరు గల్లంత్తు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739292918819_60382139-normal-WIFI.webp)
హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభించింది. పోలీసులు గజఈత గాళ్ల సాయంతో మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 12, 2025
పెద్దపల్లి: ‘స్థానిక సంస్థల గత రిజర్వేషన్లు ఓసారి చూడండి’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739285327534_51751241-normal-WIFI.webp)
తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఓట్ల కంటే ముందే జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రచారం సాగుతుంది. పెద్దపల్లి జిల్లాలో 13 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో UR-7, BC-3, SC-3 రిజర్వేషన్లు కేటాయించారు. అందులో మహిళా-7, జనరల్-6 స్థానాలు కేటాయించారు. జిల్లాలోని ఆశావాహులు వారి మండలానికి తమకు అనుకూలంగా జడ్పీటీసీ రిజర్వేషన్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
News February 12, 2025
అంబారిపేటలో బైక్ దొంగతనం.. కేసు నమోదు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739280314202_60417652-normal-WIFI.webp)
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేట గ్రామంలో శనిగారపు అశోక్ అనే వ్యక్తికి చెందిన బైకును దొంగలు ఎత్తుకెళ్లినట్లు గ్రామస్థులు మంగళవారం తెలిపారు. తాను బైకును తన పంట పొలం వద్ద పార్కింగ్ చేసి వెళ్లాడని, కొద్దిసేపటికి బైక్ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు చెప్పారు. అశోక్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలాన్ని ఎస్ఐ నవీన్ కుమార్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.