News March 24, 2025
MHBD: బెట్టింగ్తో జీవితాలు చిత్తు: ఎస్పీ

బెట్టింగ్స్ వేసి డబ్బులు నష్టపోయి జీవితాలను నాశనం చేసుకోవద్దని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కోల్కోలేని విధంగా ఆర్థిక నష్టం జరిగితే చివరకు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని ఐసీసీ నిర్వహించే మ్యాచులు క్రికెట్ ఆట అయితే ఈ ఐపీఎల్ అనేది తిమింగలాలు నిర్వహించే ఒక వ్యాపారం అన్నారు. తల్లిదండ్రులు ఈ మ్యాచులు ప్రారంభమయ్యాక తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.
Similar News
News March 26, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

MBNR: రేపు PUలో ఉగాది వేడుకలు
గద్వాల డిపో మేనేజర్కు సన్మానం
కొనసాగుతున్న టెన్త్ పరీక్షలు
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల చలివేంద్రం
ఇఫ్తార్ విందు.. పాల్గొన్న నేతలు
నాగర్కర్నూల్లో క్షుద్ర పూజల కలకలం
మార్చి 31 వరకు పన్నులు చెల్లించండి:కలెక్టర్లు
ఓపెన్ స్కూల్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి: కలెక్టర్లు
పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
News March 26, 2025
బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి వైసీపీలో కీలక పదవి

AP: శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించింది. అలాగే రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్ను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
News March 26, 2025
మంచిర్యాల: ‘యోగ, వ్యాయామం అలవాటు చేసుకోవాలి’

మంచిర్యాల జిల్లా స్థాయి మెంటల్ హెల్త్ అండ్ లీగల్ రైట్స్ అవగాహన కార్యక్రమనికి జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ హాజరయ్యారు. నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ వాడకం పెరగడం వల్ల మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయన్నారు. స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించి యోగ, వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవాలని ఆయన సూచించారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు సహాయం కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్14416ను సంప్రదించాలని సూచించారు.