News July 19, 2024

మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్: నిలిచిన విమానాలు, పలు వ్యవస్థలు

image

<<13660202>>మైక్రోసాఫ్ట్‌లో తలెత్తిన సమస్య కారణంగా<<>> ప్రపంచవ్యాప్తంగా పలు సేవలు స్తంభించాయి. ఆ సంస్థకు సైబర్ భద్రత అందించే ‘క్రౌడ్‌స్ట్రైక్’ వేదిక వైఫల్యమే దీనికి కారణంగా అంచనా వేస్తున్నారు. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే వంటి దేశాల్లో సమస్య తీవ్రంగా ఉంది. విమాన, ఆరోగ్య, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో ఆయా దేశాల ప్రజలు ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. సమస్యను పరిష్కరిస్తామని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

Similar News

News February 1, 2026

ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ ముగిసింది. మొత్తం 4 గంటల 50 నిమిషాల పాటు సిట్ అధికారులు పలు ప్రశ్నలు అడిగారు. తాము సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి విచారణ చేసినట్లు సమాచారం. మొత్తం ఆరుగురు అధికారుల బృందం కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం వాళ్లు నందినగర్‌లోని ఆయన నివాసం నుంచి వెళ్లిపోయారు.

News February 1, 2026

మీకు తెలుసా! కోయడం బట్టే ఉల్లిపాయ టేస్ట్..

image

కోసే విధానాన్ని బట్టి ఉల్లిపాయ రుచి మారుతుందని మీకు తెలుసా? ఉల్లిపాయను నిలువు(తల నుంచి వేళ్ల వైపు)గా కోస్తే కణాలు తక్కువగా దెబ్బతిని తీపి రుచి వస్తుంది. నాన్‌వెజ్ కర్రీస్ వండేటప్పుడు ఇవి త్వరగా మెత్తబడి గ్రేవీకి చిక్కదనాన్ని ఇస్తాయి. అడ్డంగా కోస్తే కణాలు విచ్ఛిన్నమై ఘాటు పెరుగుతుంది. సలాడ్ల కోసం ఇవి బెటర్. అయితే అడ్డంగా కోసినప్పుడు ఎంజైమ్స్ ఎక్కువగా విడుదలై కళ్ల నుంచి నీళ్లు అధికంగా వస్తాయి.

News February 1, 2026

పెళ్లైన 60 రోజులకే భర్తను గొంతు కోసి చంపిన భార్య

image

UP బరేలీలో పెళ్లైన 2 నెలలకే భార్య తన భర్తను చంపేసింది. 9 ఏళ్లు ప్రేమించుకున్న జితేంద్ర, జ్యోతి గతేడాది NOVలో పెళ్లి చేసుకున్నారు. జితేంద్ర ఆన్‌లైన్ జూదానికి బానిసై, భార్య ఖాతా నుంచి రూ.20 వేలు తీసుకున్నాడు. దీనిపై వివాదం చెలరేగగా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె భర్త గొంతు కోసి చంపేసింది. మృతదేహాన్ని కిటికీకి వేలాడదీసి సూసైడ్‌గా చిత్రీకరించింది. పోస్టుమార్టం నివేదికలో నిజం తేలడంతో వారిని అరెస్ట్ చేశారు.