News January 3, 2025

రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

image

AP: రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనుంది. ఈ నెల 1 నుంచి స్టార్ట్ చేస్తారని భావించినా.. అనివార్య కారణాల రీత్యా 4 నుంచి ప్రారంభించాలని సర్కారు నిర్ణయించింది. విజయవాడలోని పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పథకాన్ని ఆరంభించనున్నారు. 475 కాలేజీల్లో జరిగే ఈ కార్యక్రమం కోసం సర్కారు రూ.115 కోట్లు కేటాయించింది.

Similar News

News October 27, 2025

వైద్యురాలి ఆత్మహత్య.. సంచలన ఆరోపణలు

image

MHలో సూసైడ్ చేసుకున్న <<18107450>>వైద్యురాలిపై<<>> ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ‘గతంలో నా కూతురిని ఆమె భర్త అజింక్య(ఆర్మీ ఆఫీసర్), అత్తింటివాళ్లు చంపేశారు. కానీ సూసైడ్ చేసుకుందని లేడీ డాక్టర్ ఫేక్ పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చింది. ఆమెను ఎవరో ఒత్తిడి చేసినందుకే ఈ పని చేసింది. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. కాగా SI గోపాల్‌తో పాటు ఓ MP తనను వేధించారంటూ సదరు వైద్యురాలు సూసైడ్ నోట్‌లో రాసిన విషయం తెలిసిందే.

News October 27, 2025

11AMకు లక్కీ డ్రా.. అదృష్టం ఎవరిని వరించేనో?

image

TG: మద్యం షాపులకు ఇవాళ 11AMకు అన్ని జిల్లాల్లో దరఖాస్తుదారుల సమక్షంలో కలెక్టర్లు లక్కీ డ్రా తీయనున్నారు. 2,620 మద్యం షాపులకు 95,137 మంది దరఖాస్తు చేసుకున్నారు. నాన్ రీఫండబుల్ ఫీజు రూ.3 లక్షలు ఉన్నప్పటికీ అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఒక్క షాపు తగిలినా లైఫ్ సెట్ అవుతుందనే ఉద్దేశంతో పలువురు పదుల సంఖ్యలో అప్లికేషన్స్ పెట్టారు. మరి ఎవరి లక్ ఎలా టర్న్ అవుతుందో చూడాలి. మీరూ అప్లై చేశారా?

News October 27, 2025

గంటకు 18కి.మీ వేగంతో దూసుకొస్తున్న తుఫాను

image

AP: నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ‘మొంథా’ తుఫానుగా బలపడి తీరం వైపు దూసుకొస్తోందని APSDMA తెలిపింది. గడిచిన 3 గంటల్లో గంటకు 18కి.మీ వేగంతో కదిలిందని చెప్పింది. ప్రస్తుతానికి చెన్నైకి 600KM, విశాఖపట్నానికి 710KM, కాకినాడకు 680KM దూరంలో కేంద్రీకృతమైందని వివరించింది. తీరం వెంబడి గంటకు 90-110KM వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.