News January 4, 2025
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభం

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఈ పథకాన్ని మంత్రి నారా లోకేశ్ విజయవాడ జిల్లా పాయకాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ స్కీమ్ కోసం ప్రభుత్వం ఈ ఏడాది రూ.27.39 కోట్లు ఖర్చు చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరంలో అమలు చేసేందుకు రూ.85.84కోట్లు కేటాయించింది.
Similar News
News December 2, 2025
పవన్ సారీ చెబుతారా?

కోనసీమకు <<18446578>>దిష్టి<<>> తగిలిందంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పలువురు తెలంగాణ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. పవన్ను బహిరంగంగానే తప్పు పడుతూ వెంటనే సారీ చెప్పాలని మంత్రులు కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్తో పాటు BRS నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏదైనా కాస్త ఆలోచించి మాట్లాడి ఉండాల్సిందని మరికొందరు అంటున్నారు. దీనిపై పవన్ సారీ చెబుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
News December 2, 2025
రొయ్యల చెరువు అడుగు పాడైనట్లు ఎలా గుర్తించాలి?

కొన్నిసార్లు రొయ్యల చెరువులో నీటి నాణ్యత చాలా వేగంగా పడిపోతుంది. రొయ్యలు చెరువు అడుగు భాగంలోనే ఎక్కువ కాలం పాటు ఉంటాయి. ఒకవేళ చెరువు అడుగు భాగం చెడితే రొయ్యల ఆరోగ్యం దెబ్బతింటుంది. చెరువు అడుగు భాగం పాడైనట్లు కొన్ని సంకేతాలతో గుర్తించవచ్చు. కుళ్లిన గుడ్డు వాసన రావడం, రొయ్యలు చెరువు అంచులకు లేదా ఎయిరేటర్ల దగ్గరకు ఎక్కువగా చేరటం, అధిక బురద, రొయ్యలు బలహీనంగా మారటం వంటి లక్షణాలతో గుర్తించవచ్చు.
News December 2, 2025
వివాహానికి నిజమైన అర్థం అదే: జయా బచ్చన్

ప్రస్తుతం ఉన్న జనరేషన్కు పెళ్లి గురించి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సీనియర్ బాలీవుడ్ నటి జయా బచ్చన్ అన్నారు. ‘నేటి తరం పిల్లలకు మనం సలహాలు ఇవ్వలేం. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పిల్లలు చాలా తెలివిగా ఉంటున్నారు, అన్ని విషయాల్లో మనల్ని మించిపోయారు. అలాగే పెళ్లంటే ఇలానే ఉండాలి అని చెప్పడానికి సరైన నిర్వచనాలు లేవు. ఒకరికొకరు కష్టసుఖాల్లో తోడుండాలంతే’ అని జయ తెలిపారు.


