News August 17, 2024
ఆ విషపు మందులతో లక్షలాది మరణాలు: రామ్దేవ్

అల్లోపతి ఔషధాలపై బాబా రామ్దేవ్ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. విదేశీ కంపెనీల విషపూరిత సింథటిక్ డ్రగ్స్ వల్ల ఏటా లక్షలాది భారతీయులు మరణిస్తున్నారని మండిపడ్డారు. ‘ఔషధ స్వాతంత్ర్యం కల ఇంకా నెరవేరలేదు. బ్రిటిష్ పాలనలో జరిగినట్టే అల్లోపతి మందులతో లక్షలమంది చనిపోతున్నారు. అందుకే మేం పతంజలి ద్వారా స్వదేశీ ఉద్యమం కొనసాగిస్తున్నాం. భారతీయ, సహజ వైద్య విధానాల వైపు ప్రజల్ని మళ్లిస్తున్నాం’ అని అన్నారు.
Similar News
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<
News December 13, 2025
ఈ వాతావరణం కనకాంబరం సాగుకు అనుకూలం

అధిక తేమ, వేడి కలిగిన ప్రాంతాలు కనకాంబరం సాగుకు అనుకూలం. మొక్క పెరుగుదలకు 30 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు ఉండాలి. చల్లని వాతావరణ పరిస్థితుల్లో పూల దిగుబడి అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరీ ఎక్కువగా ఉంటే పూలు లేత రంగుకు మారి నాణ్యత తగ్గుతుంది. మరీ తక్కువ ఉష్ణోగ్రతను కూడా మొక్క తట్టుకోలేదు. నీరు నిలవని అన్ని రకాల నేలలు, ఉదజని సూచిక 6 నుంచి 7.5 మధ్య ఉన్న నేలల్లో మంచి దిగుబడి వస్తుంది.
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.


