News September 22, 2025
రాష్ట్రంపై సైకోల కళ్లు పడకూడదని వేడుకున్నా: మంత్రి అనిత

AP: రాష్ట్రంపై సైకోల కళ్లు పడకూడదని ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమ్మను వేడుకున్నట్లు హోంమంత్రి అనిత వివరించారు. బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు. పాలనలో చంద్రబాబు, పవన్, లోకేశ్కు శక్తి, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకున్నట్లు చెప్పారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వం 20ఏళ్ల పాటు ఉండాలని వేడుకున్నానన్నారు. దుర్గమ్మ దయ అందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
Similar News
News September 22, 2025
2028 నాటికి విశాఖ, విజయవాడ మెట్రోలు

AP: మెట్రో రైల్ టెండర్లలో గరిష్ఠంగా 3 కంపెనీల JVలకు అవకాశం కల్పిస్తున్నట్లు APMRCL MD రామకృష్ణారెడ్డి తెలిపారు. విశాఖ 46.23 కి.మీ, విజయవాడ 38 కి.మీల మేర పనుల్లో 40 శాతం సివిల్ వర్కులకు టెండర్లు పిలిచామన్నారు. OCT 10లోగా విశాఖకు, 14లోగా విజయవాడకు టెండర్లు దాఖలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులు రికార్డు టైమ్లో 2028 నాటికి పూర్తిచేయాలని లక్ష్యాన్ని పెట్టుకున్నామని వివరించారు.
News September 22, 2025
దసరా తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్?

TG: దసరా తర్వాత జూబ్లీహిల్స్ బైపోల్కు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ తొలివారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల <<17788984>>డేట్స్<<>> ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దాంతో పాటు జూబ్లీహిల్స్ సహా దేశంలోని మరిన్ని నియోజకవర్గాలకు షెడ్యూల్ ప్రకటిస్తుందని సమాచారం. ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, తదితర ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈసీకి పూర్తి నివేదిక సమర్పించారు.
News September 22, 2025
వ్యవసాయంలో ఎర పంటల ప్రాధాన్యం

కొన్ని రకాల పంటలు కొన్ని పురుగులను విపరీతంగా ఆకర్షిస్తాయి. ఆ పంటలను ప్రధాన పొలంలో వేస్తే పురుగు రాకను, ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. అటువంటి పంటలను ఎరపంటలు లేదా ఆకర్షక పంటలు (Trap Crop) అంటారు. ఎరపంటలు వేయడం వల్ల ప్రధాన పంటపై పురుగుల ఉద్ధృతి తగ్గుతుంది. అలాగే పురుగుమందులు వాడాల్సిన అవసరం, వాటి కొనుగోలుకు పెట్టే ఖర్చు తగ్గుతుంది. రైతులు ఈ ఎర పంటల ప్రాధాన్యాన్ని గుర్తించి ప్రధాన పంటలో వేసుకోవాలి.