News June 4, 2024

మంత్రి బొత్స సత్యనారాయణ ఓటమి

image

AP: ఉత్తరాంధ్రలో తిరుగులేని నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పరాజయం పాలయ్యారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీచేసిన బొత్సపై టీడీపీ అభ్యర్థి కళా వెంకట్రావు 11,527 ఓట్ల తేడాతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై 26,498 ఓట్ల తేడాతో బొత్స విజయం సాధించారు. చీపురుపల్లి నుంచి 2004, 2009, 2019లో విజయం సాధించిన బొత్సకు ఈసారి ఓటమి తప్పలేదు.

Similar News

News November 25, 2025

ఓయూ: ఆదివాసి బిడ్డకు ఓయూ డాక్టరేట్

image

ఆదివాసీ విద్యార్థి, ఉద్యమ నేత సాగబోయిన పాపారావుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. సోషియాలజీ ప్రొ.పి విష్ణుదేవ్ పర్యవేక్షణలో ‘ఉప ప్రణాళిక, గిరిజన అభివృద్ధి రాష్ట్రంలోని ఐటీడీఏ భద్రాచలం సామాజిక శాస్త్ర అధ్యయనం’ అనే అంశంపై ఆయన చేసిన పరిశోధనకు గాను ఓయూ ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు అధ్యాపకులు అభినందించారు.

News November 25, 2025

శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

image

రష్యాతో పీస్ డీల్‌కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.

News November 25, 2025

శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకారం?

image

రష్యాతో పీస్ డీల్‌కు ఉక్రెయిన్ అంగీకరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ‘కొన్ని చిన్న సమస్యలు పరిష్కరించాల్సి ఉంది. కానీ ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతి ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పింది’ అని అమెరికా అధికారులు తెలిపినట్లు పేర్కొంది. అయితే చర్చలు కొనసాగుతున్నాయని, ఖరారు కాలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం అబుదాబిలో US, రష్యా బృందాలు చర్చలు జరుపుతున్నాయి.