News June 20, 2024
‘విశ్వంభర’ సెట్లో చిరును కలిసిన మంత్రి దుర్గేశ్
ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ మెగాస్టార్ చిరంజీవిని ‘విశ్వంభర’ సెట్లో మర్యాద పూర్వకంగా కలిశారు. దీనిపై చిరు స్పందిస్తూ.. ‘నా మిత్రుడు దుర్గేశ్ ఏపీ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి, ఎదుర్కొంటున్న సవాళ్లను సత్వరం పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని చెప్పారు. ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News October 8, 2024
JK 90/90: కాంగ్రెస్ 9, NC 39 స్థానాల్లో లీడింగ్
జమ్మూకశ్మీర్లో 90 స్థానాల్లో లెక్కింపు కొనసాగుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ 56కు 39, కాంగ్రెస్ 39కి 9 స్థానాల్లో ఆధిక్యం లభించింది. CPM, JJNNP చెరో స్థానంలో లీడింగ్లో ఉన్నాయి. మొత్తంగా ఈ కూటమి 49 స్థానాల్లో దూకుడు కొనసాగిస్తోంది. అంటే మ్యాజిక్ ఫిగర్ను దాటేసినట్టే లెక్క. LG ఐదుగుర్ని నామినేట్ చేసినా వారికి ఫర్వాలేదు. BJP 62 చోట్ల పోటీ చేయగా 29 స్థానాల్లో ముందంజలో ఉంది. PDP 81కి 4 చోట్ల ముందుంది.
News October 8, 2024
రెండు చోట్లా ఆధిక్యంలో ఒమర్ అబ్దుల్లా
జమ్మూకశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా పోటీ చేసిన రెండు చోట్లా ఆధిక్యంలో ఉన్నారు. బుద్గాం, గందర్బల్ రెండు నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేశారు. కాగా లీడింగ్పై స్పందించిన ఒమర్ ఫలితాలపై ఇప్పుడే అంచనాకు రాలేమన్నారు. పూర్తి ఫలితాలు వెల్లడయ్యాకే ప్రభుత్వ ఏర్పాటుపై అన్ని పార్టీలతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆయన కాంగ్రెస్ కూటమితో కలిసి ఎన్నికల బరిలో నిలిచారు.
News October 8, 2024
‘పుష్ప-2’ విడుదల తేదీలో మార్పు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న ‘పుష్ప-2’ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం విడుదల తేదీకంటే ముందే రానున్నట్లు చర్చ జరుగుతోంది. డిసెంబర్ 6న రిలీజ్ అవుతుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. అయితే, ఒకరోజు ముందుగానే DEC 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుందని సినీవర్గాలు పేర్కొన్నాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నట్లు తెలిపాయి.