News December 26, 2024
మస్కట్ బాధితురాలిని రాష్ట్రానికి రప్పించిన మంత్రి లోకేశ్

AP: మస్కట్లో చిక్కుకుపోయిన ఓ మహిళను మంత్రి నారా లోకేశ్ క్షేమంగా రాష్ట్రానికి రప్పించారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన వాసంశెట్టి పద్మ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లారు. ఆమెకు అక్కడ యజమానుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె తన బాధను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన లోకేశ్ వెంటనే స్పందించి ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు.
Similar News
News September 23, 2025
GSTతో రాష్ట్రానికి రూ.7 వేల కోట్ల నష్టం: పొన్నం

TG: ప్రజలను దోచుకునేందుకు GSTని కేంద్రం ఆయుధంగా వాడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ‘GST అంటే గబ్బర్సింగ్ ట్యాక్స్ అని రాహుల్ గాంధీ ఎప్పుడో చెప్పారు. శవపేటికలపై కూడా కేంద్రం ట్యాక్స్ విధించింది. 8 ఏళ్లు ప్రజలను దోచుకుంది. ఇప్పుడు ఆర్థిక సంక్షోభం నుంచి తప్పించుకోవడానికి GST తగ్గించింది. దీంతో రాష్ట్రానికి రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లుతుంది. దాన్ని కేంద్రమే పూడ్చాలి’ అని డిమాండ్ చేశారు.
News September 23, 2025
ఈ అలవాట్లు అందానికి శత్రువులు

మచ్చలు లేకుండా అందంగా మెరుస్తూ ఉండే చర్మం కావాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. అయితే దీనికోసం కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు చర్మనిపుణులు. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం, పాల ఉత్పత్తులు మితంగా తీసుకోవాలి. చక్కెర, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండాలి. ఎవరో చెప్పారని చర్మంపై ప్రయోగాలు చెయ్యకూడదు. కంటినిండా నిద్ర చర్మ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పడుకొనే ముందు మేకప్ తొలగించాలి. నీరు ఎక్కువగా తాగాలి.
News September 23, 2025
పాలస్తీనా దేశం అనేది ఉండదు: నెతన్యాహు

పాలస్తీనాను దేశంగా గుర్తిస్తూ UK, కెనడా, AUS తదితర దేశాలు ప్రకటించడంపై ఇజ్రాయెల్ PM నెతన్యాహు ఫైరయ్యారు. ‘పాలస్తీనా దేశం అనేది ఉండదు. మా భూభాగంలో టెర్రర్ స్టేట్ ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాన్ని ఎదుర్కొంటాం. OCT 7న మారణకాండ సృష్టించిన టెర్రరిస్టులకు మీరు భారీ బహుమతి ఇస్తున్నారు. విదేశాలతో పాటు స్వదేశంలో వ్యతిరేకత ఎదురైనా టెర్రర్ స్టేట్ ఏర్పాటును ఆపాను. ఇక ముందు కూడా అది జరగదు’ అని స్పష్టంచేశారు.