News November 11, 2024
ఆ ఉద్యోగులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్

AP: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మంత్రి లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీ)తో పాటు జిల్లాలు, మండలాల్లో సమగ్ర శిక్షా పరిధిలోని ఉద్యోగులు గౌరవ వేతనం కోసం గత ప్రభుత్వ హయాంలో 21రోజులు సమ్మె చేశారని ఆయన గుర్తుచేశారు. ఆ సమ్మె కాలానికి సంబంధించి వేతనాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నేడు ఆ ఉత్తర్వులు జారీ అయినట్లు లోకేశ్ పేర్కొన్నారు.
Similar News
News February 11, 2026
శాస్త్ర రంగంలో మహిళలను ప్రోత్సహించేందుకు

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం అందించడం కోసం ఓ రోజు ఉండాలని యునెస్కో నిర్ణయించింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి అయిన ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్’గా నిర్వహించాలని 2015లో నిర్ణయించింది. సైన్స్&టెక్నాలజీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
News February 11, 2026
మారిన చైనా వైఖరి: UNSCలో భారత శాశ్వత సభ్యత్వానికి మద్దతు!

UNSCలో భారత్ శాశ్వత సభ్యత్వ ఆకాంక్షలను ‘గౌరవిస్తాం’ అని చైనా ప్రకటించింది. గతంలో ఆ దిశగా ఇండియా చేసిన యత్నాలను వ్యతిరేకించిన ఏకైక శాశ్వత సభ్యదేశం చైనా కావడం గమనార్హం. ఢిల్లీలో జరిగిన చర్చల్లో భారత్ అధ్యక్షతన జరగబోయే BRICS సదస్సుకు కూడా చైనా పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ మార్పు అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాబల్యాన్ని పెంచడంతో పాటు మండలిలో శాశ్వత సభ్యత్వానికి మార్గాన్ని సుగమం చేసే ఛాన్స్ ఉంది.
News February 11, 2026
ESIC హాస్పిటల్ భిలాయ్లో ఉద్యోగాలు

<


