News September 4, 2025
యూరియా లభ్యతపై మంత్రి లోకేశ్ ఆరా

AP: రైతుల ముసుగులో YCP చేస్తున్న కుతంత్రాలను తిప్పికొట్టాలని మంత్రులకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు. క్యాబినెట్కి ముందు మంత్రులతో అల్పాహార భేటీలో పాల్గొన్నారు. జిల్లాల్లో యూరియా సమస్య ఉందా అని ఆరా తీశారు. తగినంత యూరియా ఉందని మంత్రులు తెలిపారు. తెలంగాణ రాజకీయాలపైనా మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జి మంత్రులు సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్లు నిర్వహించాలని లోకేశ్ సూచించారు.
Similar News
News September 7, 2025
అందుబాటులో 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు: సీఎం

AP: రాష్ట్రంలో 77,396 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని CM చంద్రబాబు తెలిపారు. ‘రేపు కాకినాడకు షిప్ ద్వారా 15వేల మెట్రిక్ టన్నుల ఎరువులు వస్తాయి. మరో 10 రోజుల్లో 41 వేల టన్నుల ఎరువులు రానున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా కలెక్టర్ వరకు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎరువుల సరఫరాను పరిశీలించాలి’ అని టెలీ కాన్ఫరెన్సులో ఉన్నతాధికారులను CM ఆదేశించారు.
News September 7, 2025
బిగ్బాస్-9 కంటెస్టెంట్లు వీరేనా?

రేపటి నుంచి ప్రారంభం కానున్న <<17604853>>బిగ్బాస్-9లో<<>> పాల్గొనే కంటెస్టెంట్ల లిస్ట్ SMలో చక్కర్లు కొడుతోంది. వీరిలో ఆషా సైనీ, సంజనా గల్రానీ, ఇమ్మాన్యుయేల్, రీతూ, తనూజ గౌడ, శ్రష్ఠి, రాము రాథోడ్, సుమన్ శెట్టి, భరణి ఉన్నారని సమాచారం. ఈసారి ఆరుగురు సామాన్యులకు అవకాశం కల్పించినట్లు టాక్. మాస్క్ మ్యాన్ హరీశ్, దమ్ము శ్రీజ, ఆర్మీ పవన్ కళ్యాణ్, డీమాన్ పవన్, మనీష్, ప్రియ వీరిలో ఉన్నట్లు తెలుస్తోంది.
News September 7, 2025
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్ర తీరాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో వర్షాలు పడిన విషయం తెలిసిందే.