News September 4, 2025
యూరియా లభ్యతపై మంత్రి లోకేశ్ ఆరా

AP: రైతుల ముసుగులో YCP చేస్తున్న కుతంత్రాలను తిప్పికొట్టాలని మంత్రులకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు. క్యాబినెట్కి ముందు మంత్రులతో అల్పాహార భేటీలో పాల్గొన్నారు. జిల్లాల్లో యూరియా సమస్య ఉందా అని ఆరా తీశారు. తగినంత యూరియా ఉందని మంత్రులు తెలిపారు. తెలంగాణ రాజకీయాలపైనా మంత్రుల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇన్ఛార్జి మంత్రులు సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్లు నిర్వహించాలని లోకేశ్ సూచించారు.
Similar News
News February 7, 2026
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

నేపాల్ యాక్టర్ సునీల్ థాపా(68) కన్నుమూశారు. అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించడంతో కాఠ్మాండూ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 40 ఏళ్ల కెరీర్లో 300కి పైగా నేపాలీ, బాలీవుడ్, భోజ్పురి సినిమాల్లో నటించారు. హిందీలో ‘మేరీ కోమ్’, తెలుగులో ‘మిరాయ్’ మూవీలోనూ కనిపించారు. ఆయన మృతిపై సినిమా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో పాటు పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
News February 7, 2026
దేశంలో ముస్లిం జనాభా హిందువులను దాటదు: అసదుద్దీన్

దేశంలో హిందూ జనాభాను ముస్లింలు ఎప్పటికీ అధిగమించలేరని MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. ముస్లిం జనాభా స్టెబిలైజ్ అవుతుందన్నారు. ‘20 ఏళ్ల తర్వాత వృద్ధుల సంఖ్య పెరుగుతుంది. కానీ ద్రవ్యోల్బణం, ఇతర అంశాలపై ఆలోచించకుండా ముస్లిం జనాభా ఎక్కువవుతోందని గతంలో కొందరు అన్నారు. వృద్ధుల సంఖ్య పెరిగితే దేశంపై ఎంత ప్రభావం పడుతుందనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. పిల్లల్ని కనాలని చెబుతున్నారు’ అని విమర్శించారు.
News February 7, 2026
నెదర్లాండ్స్.. ఓడినా వణికించింది!

T20 WCలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన <<19075448>>తొలి మ్యాచ్<<>>లో నెదర్లాండ్స్ చివరి దాకా పోరాడింది. ఒకానొక దశలో గెలుపు దిశగా సాగింది. పాక్ 7 వికెట్లు కూల్చి 12 బంతుల్లో 29 పరుగులు కొట్టాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. కానీ 19వ ఓవర్లో ఒత్తిడికి గురైంది. ఒక క్యాచ్ కూడా మిస్ చేసుకుంది. ఫహీమ్ అష్రఫ్ ధాటికి 24 పరుగులు సమర్పించుకుంది. ఇదే మ్యాచ్ను మలుపుతిప్పింది. ఓడినా సరే పాక్కు ముచ్చెమటలు పట్టించింది.


