News June 10, 2024
మంత్రి పదవులు.. ఏ పార్టీకి ఎన్ని?

ఏపీ కేబినెట్లో జనసేన 5 మంత్రి పదవులు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా సీఎంతో కలిపి 26 మందికి మించి మంత్రివర్గం ఉండకూడదనేది నిబంధన. ఈసారి టీడీపీ నుంచి ఊహించినదానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఆశావహులు కూడా ఎక్కువే ఉండనున్నారు. దీంతో CBN సహా 20 టీడీపీకి, జనసేనకు 5, బీజేపీకి ఒక మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని సమాచారం. దీనిపై రేపు ఎమ్మెల్యేల భేటీలో క్లారిటీ రావొచ్చు.
Similar News
News September 13, 2025
3,115 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ

ఈస్టర్న్ రైల్వేలో 3,115 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఇవాళే(SEP 13) చివరితేదీ. ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, పెయింటర్, లైన్మెన్, వైర్మెన్, ఎలక్ట్రీషియన్, ఏసీ మెకానిక్ విభాగాల్లో ఖాళీలున్నాయి. టెన్త్, ఇంటర్, ఉద్యోగాన్ని బట్టి ఐటీఐలో పాసవ్వాలి. వయసు 15-24ఏళ్ల లోపు ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
వెబ్సైట్: <
News September 13, 2025
ఫేస్ టేపింగ్ చేస్తున్నారా?

ముఖంపై ముడతలు తగ్గాలని చాలామంది ఖరీదైన బొటాక్స్ ట్రీట్మెంట్ల వైపు వెళ్తుంటే మరికొందరు ఫేస్ టేపింగ్ చేసుకుంటారు. దీనివల్ల తాత్కాలిక ప్రయోజనమే ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఫేస్ టేపింగ్ ఎక్కువగా చేసుకుంటే ముఖంపై ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇలా కాకుండా స్కిన్ కేర్పై దృష్టి పెట్టి ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే చర్మం అందంగా, యవ్వనంగా మెరుస్తుందని సూచిస్తున్నారు.
News September 13, 2025
సుశీలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా నిన్న బాధ్యతలు స్వీకరించిన <<17691512>>సుశీల<<>> కర్కీకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్లో సోదర, సోదరీమణుల శాంతి, అభ్యున్నతికి భారత్ కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా అక్కడ Gen-G యువత ఇటీవల హింసాత్మక ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో అధ్యక్షుడు పార్లమెంట్ను రద్దు చేసి నిరసనకారుల ప్రతిపాదన మేరకు సుశీలను ప్రధానిగా నియమించారు.