News June 23, 2024

డయేరియాపై అధికారులతో మంత్రి సమీక్ష

image

AP: NTR(D) జగ్గయ్యపేటలో డయేరియా కలకలం రేపుతోంది. ఇప్పటివరకు ఇద్దరు మృతి చెందగా, 35 మందికి పైగా బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ బాధితులను పరామర్శించారు. ‘మొత్తం 58 కేసులు నమోదయ్యాయి. నీటి సమస్య కారణంగా ఇలా జరిగినట్లు అనుమానిస్తున్నాం. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలి’ అని ఆయన సూచించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు.

Similar News

News November 27, 2025

హసీనా అప్పగింతపై పరిశీలిస్తున్నాం: భారత్

image

భారత్‌లో తలదాచుకుంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింతపై అక్కడి ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఆ దేశంలో నివసిస్తున్న ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు, శాంతి, ప్రజాస్వామ్య పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉంటుందన్నారు. తీవ్ర నేరాలు చేశారనే ఆరోపణలపై విచారణ జరిపిన ప్రత్యేక ట్రిబ్యునల్ ఆమెకు మరణశిక్ష విధించింది.

News November 27, 2025

ఆకుకూరల సాగుకు అనువైన రకాలు

image

ఈ కింద సూచించిన ఆకుకూరల రకాలు మన ప్రాంతంలో సాగుకు అనుకూలం. వీటిని సరైన యాజమాన్యాన్ని పాటిస్తూ సాగు చేస్తే మంచి దిగుబడి సాధించవచ్చని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
☛ కొత్తిమీర: సిందు సాధన, స్వాతి, సుధా, సుగుణ, సురచి(LCC-234), APHU ధనియా-1 (వేసవి రకం), సుస్థిర
☛ కరివేపాకు: సువాసిని, భువనేశ్వర్, సెంకంపు
☛ మునగ: జాఫ్నా(ఇది బహువార్షిక రకం), పి.కె.యం-1( ఇది ఏక వార్షిక రకం)

News November 27, 2025

ఆయన 3 కాలాలకు ఏకైక పాలకుడు..

image

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః|
భూతకృత్ భూతభృద్భావో భూతాత్మా భూతభావనః||
విశ్వమంతా విష్ణువుతో నిండి ఉందని ఈ శ్లోకం ప్రకటిస్తుంది. ఆయన 3 కాలాలకు ఏకైక పాలకుడు. ఈ జగత్తును సృష్టించి, భరించి, పోషించే శక్తిమంతుడు. సమస్త జీవులలో కొలువై ఉన్నాడు. సకల భూతాలకు ప్రాణమిచ్చి, పోషిస్తున్నాడు. అందుకే ఆయనను ఆరాధిస్తే వెంటనే అనుగ్రహించి, మన కష్టాలను దూరం చేస్తాడని అంతా నమ్ముతారు. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>