News September 5, 2024

మంత్రి సవిత తనయుడి మంచి మనసు

image

AP: విజయవాడ వరద బాధితులకు మంత్రి సవిత తనయుడు జగదీశ్ సాయి తన వంతు సాయం చేశారు. తన కిడ్డీ బ్యాంక్‌లో దాచుకున్న రూ.21 వేలను సీఎం చంద్రబాబుకు అందించారు. చిన్న వయసులోనే సహృదయంతో ఆలోచించిన ఆ బాలుడిని అందరూ అభినందిస్తున్నారు. కాగా వారంరోజులుగా విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సవిత పర్యటిస్తున్నారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఆమె చర్యలు తీసుకుంటున్నారు.

Similar News

News November 28, 2025

కేసీఆర్ వల్ల కాదు సోనియా వల్ల తెలంగాణ వచ్చింది: పీసీసీ చీఫ్

image

TG: 2009లో కేసీఆర్ చేసిన దీక్ష పూర్తిగా నాటకమని, ఆయన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. విద్యార్థుల ఆత్మబలిదానాలకు స్పందించి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ‘రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నా’ అని చెప్పి నిమ్స్‌లో ఫ్లూయిడ్స్ తీసుకున్నారని ఆరోపించారు. ‘దీక్ష దివాస్’ పేరిట ప్రజలను మోసం చేయడానికి BRS సిద్ధమైందని మీడియా సమావేశంలో విమర్శించారు.

News November 28, 2025

హెయిర్‌లాస్‌కు చెక్ పెట్టే LED హెల్మెట్

image

వాతావరణ మార్పులు, జీవనశైలి వల్ల హెయిర్‌లాస్ కామన్ అయిపోయింది. దీనికి ఈ LED రెడ్‌లైట్ హెల్మెట్ పరిష్కారం చూపుతుంది. ఈ డివైజ్‌ని ఆన్‌ చేసి రోజూ 25 నిమిషాలు తలకు పెట్టుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ట్రీట్మెంట్‌ సెషన్‌లను ట్రాక్‌ చేయడానికి రిమోట్‌లో ఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంటుంది. దీంట్లోని సెన్సార్లు ఉష్ణోగ్రత స్థాయిని పెరగనివ్వకుండా చూస్తాయి. ఇవి అన్ని ఆన్‌లైన్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి.

News November 28, 2025

స్వామి సన్నిధానాన్ని చేరేందుకు.. కష్టాన్ని కూడా మర్చిపోతారు

image

శబరిమల యాత్రలో నీలిమల కొండను కఠినమైన సవాలుగా భావిస్తారు. కానీ, అయ్యప్ప నామ స్మరణతో సులభంగా ఈ కొండను ఎక్కేస్తారు. అయితే ఇక్కడి నుంచే భక్తులకు సన్నిధానానికి త్వరగా చేరాలనే ఉత్కంఠ, స్వామివారి దివ్య మంగళ రూపాన్ని చూడాలనే ఆత్రుత మొదలవుతాయట. స్వామి దర్శనం పట్ల ఉండే ఈ అపారమైన భక్తి భావమే ఈ కఠినమైన దారిని సులభంగా దాటేలా చేస్తుందని నమ్మకం. <<-se>>#AyyappaMala<<>>