News September 15, 2025
త్వరలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ: మంత్రి అనగాని

AP: భూకబ్జాలను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చామని మంత్రి అనగాని సత్యప్రసాద్ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తెలిపారు. ఫ్రీహోల్డ్ భూముల విషయంలో జరిగిన అక్రమాలను కూడా అరికట్టేలా చర్యలు చేపట్టామన్నారు. నాలా చట్టాన్ని రద్దు చేసి పారిశ్రామిక వేత్తలకు, భూ యజమానులకు ఇబ్బందులు లేకుండా చేశామని వివరించారు. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను త్వరలోనే సీఎం చేతుల మీదుగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
నాలుక మీద పుట్టుమచ్చ ఉంటే వారు చెప్పింది నిజమవుతుందా?

నాలుకపై పుట్టుమచ్చ ఉన్నవారు ఏది చెబితే అది నిజం అవుతుందని చాలామంది నమ్ముతారు. అయితే ఇలా ఉండటం ఓ దైవిక సంకేతమని సాముద్రిక శాస్త్రం చెబుతోంది. వీరు గత జన్మలో చేసిన పుణ్యాల వల్ల ఈ గుర్తులు వస్తాయట. అలాగే మృదు స్వభావులై ఉంటారట. సైన్స్ పరంగా.. ఇవి కేవలం మెలనిన్ కణాల కూర్పు మాత్రమే. వారు బాధలో అన్న మాటలు నిజమవుతాయనే నమ్మకం వెనుకున్న అసలు ఉద్దేశం.. మానసికంగా ఇబ్బంది పెట్టకుండా గౌరవించడమే.
News February 9, 2026
వరిలో సల్ఫైడ్ దుష్ప్రభావాన్ని ఎలా గుర్తించాలి?

వరి పంట అక్కడక్కడ గుంపులు గుంపులుగా పసుపు వర్ణంలోకి మారి ఎండిపోతోంది. సల్ఫైడ్ (గంధకం) దుష్ప్రభావమే దీనికి కారణం. సల్ఫైడ్ దుష్ప్రభావమున్న నేల బాగా మెత్తగా ఉండి, పొలంలో నడుస్తుంటే కాలు చాలా లోతుగా దిగబడి, గాలి బుడగల రూపంలో గాలి బయటకు వస్తుంది. నేల నుంచి దుర్వాసన రావడంతో పాటు మొక్కను వేర్లతో బయటకు తీస్తే కుళ్లిన కోడిగుడ్ల వాసన వస్తుంది. ఈ సమస్య తీవ్రమైతే మొక్కలు పూర్తిగా చనిపోయే అవకాశం ఉంది.
News February 9, 2026
ICSILలో డేటా ఎంట్రీ పోస్టులు

న్యూఢిల్లీలోని ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్(<


