News April 1, 2024

కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సీతక్క

image

TG: మిషన్ భగీరథపై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ మంత్రి సీతక్క బహిరంగ లేఖ విడుదల చేశారు. గత ప్రభుత్వం కన్నా సమర్థవంతంగా ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని అన్నారు. నీటి కొరత లేకుండా చర్యలు చేపట్టాలని ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తామని.. అర్థం లేని విమర్శలు సరికాదని పేర్కొన్నారు.

Similar News

News March 16, 2026

‘బాబ్ ఎల్-మండేబ్’నూ మూసేస్తే ప్రత్యామ్నాయమిదే

image

హార్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంటుండగా దానికి మద్దతుగా <<19387645>>‘బాబ్ ఎల్-మండేబ్’<<>> జలసంధినీ మూసివేస్తామని యెమెన్‌లోని హౌతీ గ్రూప్ హెచ్చరించింది. ఈ మార్గంలో యూరప్ నుంచి ఆసియాకు సరకు రవాణాకు 20-25 రోజుల సమయం పడుతోంది. ఇది బందయితే ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా చుట్టూ తిరిగి ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ ద్వారా రవాణాకు 30-40 రోజుల టైమ్ పడుతుంది. దీనివల్ల 30% గ్లోబల్ ట్రేడ్‌పై ప్రభావం పడుతుంది.

News March 16, 2026

నందీశ్వరుడు శివుడి వైపే ఎందుకు చూస్తాడు?

image

శివాలయాల్లో నంది శివుడి వైపే చూస్తుంటాడు. ఇది ఏకాగ్రత, భక్తికి సంకేతం. ఆయన శివుడికి అత్యంత సన్నిహితుడైన ద్వారపాలకుడు. మనసులోని ఆలోచనలు అటు ఇటు తిరగకుండా ఎప్పుడూ దైవచింతనలోనే ఉండాలని నంది స్థితి మనకు బోధిస్తుంది. భక్తుల కోరికలను విన్నవిస్తూ, వారిని శివదర్శనానికి సిద్ధం చేసేందుకు ఆయన శివుడి వైపే చూస్తూ ఉంటారు. ఆయన చెవిలో కోరికలు చెబితే వాటిని ఆయన నేరుగా శివుడికి చేరవేస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

News March 16, 2026

ఎక్కువసార్లు ఫేస్ వాష్ చేస్తే ఏమవుతుంది?

image

కొందరు ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుకోవాలని పదేపదే సబ్బుతో ఫేస్ వాష్ చేసుకుంటుంటారు. దీని వల్ల చర్మం సహజ నూనెలను కోల్పోతుంది. పీహెచ్‌ స్థాయి తగ్గడంతోపాటు చర్మంపై రక్షణగా ఉండే పొర కూడా బలహీన పడిపోతుంది. దాంతో స్వేదగ్రంథులు మరింత నూనెను ఉత్పత్తి చేస్తూ.. మొటిమలు రావడానికి కారణం అవుతాయి. అలాగే ముఖం ఎక్కువగా కడుక్కోవడం, తుడుచుకోవడం వల్ల చర్మం పొడిబారుతుంది.