News September 3, 2024

ఆదిలాబాద్‌లో పర్యటించిన మంత్రి శ్రీధర్‌బాబు

image

TG: ఆదిలాబాద్‌లోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి శ్రీధర్‌బాబు పర్యటించారు. వరద ముంపుతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ప్రాణనష్టం జరిగిన ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు సాయం ఇస్తామన్నారు. పశువులను కోల్పోయిన వారికి రూ.50వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. పెన్‌గంగాను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ సమయంలో రాజకీయాలకు చోటు లేదని మంత్రి అభిప్రాయపడ్డారు.

Similar News

News November 18, 2025

CNG సరఫరా నిలిచి ముంబైలో స్తంభించిన రవాణా

image

ముంబైలో 2 రోజులుగా CNG సరఫరా నిలిచి ప్రైవేట్, పబ్లిక్ రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పైప్ లైన్లో సమస్యతో నగరంలోని 486 రీఫిల్లింగ్ స్టేషన్లలో ఆదివారం నుంచి గ్యాస్ సరఫరా నిలిచింది. CNGతో నడిచే ఆటోలు, కార్లు, బస్సులు తిరగక అవస్థలు తప్పలేదు. సోమవారం నాటికి కొంతమేర సరఫరా చేపట్టారు. నేటి మధ్యాహ్నానికి కానీ పూర్తి సరఫరా కాదని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా ముంబైలో CNGతో నడిచే కార్లే 5 లక్షల వరకు ఉన్నాయి.

News November 18, 2025

CNG సరఫరా నిలిచి ముంబైలో స్తంభించిన రవాణా

image

ముంబైలో 2 రోజులుగా CNG సరఫరా నిలిచి ప్రైవేట్, పబ్లిక్ రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పైప్ లైన్లో సమస్యతో నగరంలోని 486 రీఫిల్లింగ్ స్టేషన్లలో ఆదివారం నుంచి గ్యాస్ సరఫరా నిలిచింది. CNGతో నడిచే ఆటోలు, కార్లు, బస్సులు తిరగక అవస్థలు తప్పలేదు. సోమవారం నాటికి కొంతమేర సరఫరా చేపట్టారు. నేటి మధ్యాహ్నానికి కానీ పూర్తి సరఫరా కాదని కంపెనీలు పేర్కొన్నాయి. కాగా ముంబైలో CNGతో నడిచే కార్లే 5 లక్షల వరకు ఉన్నాయి.

News November 18, 2025

మావోలకు మరో 4 నెలలే గడువు: బండి

image

TG: అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కోరారు. హిడ్మా హతం సందర్భంగా ఆయన వేములవాడలో మీడియాతో మాట్లాడారు. వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని అంతం చేస్తామని, మరో 4 నెలలే ఉన్నందున నక్సల్స్ లొంగిపోవాలని పిలుపునిచ్చారు. బుల్లెట్‌ను కాకుండా బ్యాలెట్‌ను నమ్ముకోవాలని సూచించారు. కేవలం పోలీసులు, సైనికుల చేతుల్లోనే తుపాకులు ఉండాలన్నారు.