News September 13, 2024
రైతు భరోసాపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

TG: ఈ సారి పంట వేసిన రైతులకే రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే పంట బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ చేశామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు ఈ నెలాఖరులోపు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రైతు భరోసా పథకంలో భాగంగా ఎకరాకు రూ.7,500 చొప్పున రెండు విడతల్లో ఏడాదికి రూ.15,000 అందించాల్సి ఉంది.
Similar News
News April 6, 2026
కర్నూలు: ఈ నెల 8న జిల్లా స్థాయి బాస్కెట్బాల్ ఎంపికలు

కర్నూలు అవుట్డోర్ స్టేడియంలోని బాస్కెట్బాల్ ఎరీనాలో ఈనెల 8న జిల్లా స్థాయి జూనియర్, సబ్ జూనియర్ విభాగాల ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ ప్రతినిధులు దాదాభాష, మురళి తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని కోరారు. ఎంపికైన వారు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా తరఫున పాల్గొంటారని వారు వెల్లడించారు.
News April 6, 2026
లాకప్ డెత్ కేసు.. తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష

తమిళనాడులో 2020లో జరిగిన తండ్రి-కుమారుల లాకప్ డెత్ కేసుపై మదురై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో తొమ్మిది మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది. లాక్డౌన్లో 2020 జూన్ 19న జయరాజ్, ఆయన కుమారుడు జే బెన్నిక్స్ను పోలీసులు లాకప్లో వేశారు. విచారణ పేరుతో హింసించడంతో వారు ప్రాణాలు కోల్పోయారు. అనుమతించిన దాని కంటే ఎక్కువ సమయం మొబైల్ షాప్ నడిపారని వీరిని అరెస్ట్ చేయగా ఆ ఆరోపణల్లో నిజం లేదని తేలింది.
News April 6, 2026
వాట్సాప్ యూజర్లకు శుభవార్త

జర్నీస్, ఔట్ డోర్స్లో వాట్సాప్ ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు నాయిస్తో ఇబ్బంది పడుతున్నారా? అలాంటి వారికి వాట్సాప్ శుభవార్త చెప్పింది. రియల్ టైమ్లో బ్యాక్ గ్రౌండ్ నాయిస్ను తొలగించి, వాయిస్ క్వాలిటీని పెంచే ఫీచర్ను డెవలప్ చేసింది. దీన్ని ప్రస్తుతం కొందరు Beta యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే అందరికీ 2.26.14.1 వెర్షన్ అప్డేట్ను విడుదల చేసే అవకాశం ఉంది.


