News January 24, 2025
కౌశిక్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ వార్నింగ్

TG: తీరు మార్చుకోకపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఉండదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. యువ రాజకీయ నాయకుడికి అంత ఆవేశం పనికిరాదని మంత్రి హితవు పలికారు. తమ ఇద్దరికి ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని ఉత్తమ్ సూచించారు.
Similar News
News November 22, 2025
ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.
News November 22, 2025
రబీ వరి.. ఇలా నాటితే అధిక దిగుబడి

వరిలో బెంగాలీ నాట్ల పద్ధతి మంచి ఫలితాలనిస్తోంది. బెంగాలీ కూలీలు వరి నారును వరుస పద్ధతిలో మొక్కకు మొక్కకు మధ్య 6-8 అంగుళాల దూరం ఉండేలా నాటి.. 9 వరుసలకు ఒక కాలిబాట తీస్తున్నారు. దీని వల్ల మొక్కల మధ్య గాలి, వెలుతురు బాగా తగిలి, చీడపీడల ఉద్ధృతి తగ్గి దిగుబడి పెరుగుతోంది. ఈ పద్ధతిలో ఎకరాకు 15KGల విత్తనం చాలు. కూలీల ఖర్చు కూడా తగ్గడంతో పెట్టుబడి తగ్గుతుంది. మరింత సమాచారం కోసం <<-se_10015>>పాడిపంట క్లిక్<<>> చేయండి.
News November 22, 2025
మహిళలు ఎక్కువ గంటలు పని చేస్తే?

కెరీర్లో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఎక్కువ గంటలు పనిచేసే మహిళలకు ఒత్తిడి, ఆందోళన పెరిగి పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒకవేళ గర్భం దాల్చినా గర్భస్రావం జరగడం, ప్రీమెచ్యూర్ బేబీ, ఎదుగుదల లోపాలు, ప్రీఎక్లాంప్సీయా ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ గంటలు పని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గినా.. ఆరోగ్య సమస్యలు మాత్రం పెరుగుతాయని చెబుతున్నారు.


