News September 19, 2024
YSRను తిట్టినవారికే మంత్రి పదవులు ఇచ్చారు: బాలినేని

AP: తాను ఏ తప్పూ చేయకపోయినా మంత్రి పదవి నుంచి తీసేశారని వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కానీ వైఎస్ఆర్ను తిట్టినవారిని మాత్రం మంత్రి పదవుల్లో కొనసాగించారని ఆయన అన్నారు. ‘నేనెప్పుడూ వ్యక్తిగత అవసరాల కోసం జగన్ను కలవలేదు. ప్రజా సమస్యల కోసమే ఆయనను కలిశాను. జగన్ కోసం ఉప ఎన్నికలకు వెళ్లిన 17 మందిలో ఇప్పుడు ఒక్కరైనా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News December 27, 2025
HEADLINES

* రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ.. CM CBN వార్నింగ్
* తెలంగాణ కోసం పోరాడేది BRS మాత్రమే: KCR
* డబుల్ ఇంజిన్ సర్కారుతోనే TG అభివృద్ధి: కిషన్ రెడ్డి
* మా అయ్య మగాడు, మొనగాడు.. రేవంత్కు KTR కౌంటర్
* త్వరలో దివ్యాంగులకు ఉచిత బస్సు: AP మంత్రి డోలా
* భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
* 3వ టీ20లో శ్రీలంక ఉమెన్స్ టీమ్పై భారత్ విజయం.. సిరీస్ కైవసం
News December 27, 2025
స్వేచ్ఛనిస్తే మళ్లీ బీజేపీలోకి..: రాజాసింగ్

TG: తాను BJP సైనికుడిని అని, కేంద్ర లేదా రాష్ట్ర నాయకులు తనను పిలిచిన రోజు మళ్లీ పార్టీలో చేరతానని గోషామహల్ MLA రాజాసింగ్ తెలిపారు. అయితే ఆ సమయంలో తనకు పార్టీ పెద్ద నాయకుల నుంచి స్వేచ్ఛ ఇవ్వాలని కోరతానని చెప్పారు. ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉండి, ఓ అన్నయ్య గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోతే.. ఏదో ఒక రోజు అతను ఇంటికి తిరిగి రావాల్సిందే అని అన్నారు. అలాగే తాను కూడా రీఎంట్రీ ఇస్తాననే హింట్ ఇచ్చారు.
News December 27, 2025
‘పాలమూరు-రంగారెడ్డి’ని సందర్శించనున్న KCR!

TG: అసెంబ్లీ సమావేశాల అనంతరం ప్రజల్లోకి వెళ్లనున్న KCR తొలుత ఉమ్మడి MBNRలో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తారని సమాచారం. దక్షిణ తెలంగాణకు జీవనాడి అయిన ప్రాజెక్టును కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని కేసీఆర్ ఇప్పటికే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే అంశాన్ని జిల్లా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది.


