News September 19, 2024

YSRను తిట్టినవారికే మంత్రి పదవులు ఇచ్చారు: బాలినేని

image

AP: తాను ఏ తప్పూ చేయకపోయినా మంత్రి పదవి నుంచి తీసేశారని వైసీపీ మాజీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కానీ వైఎస్ఆర్‌ను తిట్టినవారిని మాత్రం మంత్రి పదవుల్లో కొనసాగించారని ఆయన అన్నారు. ‘నేనెప్పుడూ వ్యక్తిగత అవసరాల కోసం జగన్‌ను కలవలేదు. ప్రజా సమస్యల కోసమే ఆయనను కలిశాను. జగన్ కోసం ఉప ఎన్నికలకు వెళ్లిన 17 మందిలో ఇప్పుడు ఒక్కరైనా ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్నారా?’ అని ఆయన ప్రశ్నించారు.

Similar News

News November 17, 2025

శ్రీవారి సన్నిధిలో ఆంజనేయుడి ఆలయం

image

తిరుమల శ్రీవారి ఆలయం సన్నిధిలో ఎత్తైన ప్రదేశంలో ‘శ్రీ బేడీ ఆంజనేయస్వామి ఆలయం’ కనిపిస్తుంది. బాల్యంలో హనుమంతుడు తన వాహనమైన ఒంటె కోసం తిరుగుతుండేవాడు. ఆ అల్లరిని కట్టడి చేయడానికి, తల్లి అంజనాదేవి ఆయనకు బేడీలు తగిలించి, తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా కుదురుగా ఉండమని నిలబెట్టిందట. అందుకే ఈ ఆలయం బేడీ ఆంజనేయస్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ స్వామి కట్టుబాటుకు ప్రతీక. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 17, 2025

సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 1,785 పోస్టులు

image

సౌత్ ఈస్ట్రన్ రైల్వే 1,785 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. టెన్త్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపి‌క చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, PwBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://www.rrcser.co.in/

News November 17, 2025

సౌదీ ప్రమాద మృతుల కుటుంబాలకు ₹5 లక్షల పరిహారం

image

TG: సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున పరిహారం అందించాలని క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్, MIM MLA, మైనారిటీ విభాగం అధికారితో కూడిన ప్రతినిధుల బృందాన్ని ప్రభుత్వం సౌదీకి పంపించనుంది. మృతుల భౌతిక కాయాలకు మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు జరిపించనుంది. బాధిత కుటుంబాల నుంచి ఇద్దరు చొప్పున తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను CM ఆదేశించారు.