News January 3, 2025

తల్లికి వందనం అమలుపై మంత్రి క్లారిటీ

image

AP: ఈ ఏడాది జూన్ 15లోగా తల్లికి వందనం స్కీమ్‌ను అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో వేర్‌హౌస్ కార్పొరేషన్ గిడ్డంగులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఏటా రూ.15,000 చొప్పున అందిస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News December 12, 2025

‘అఖండ-2’ నిర్మాతలు, BMSపై హైకోర్టు ఆగ్రహం

image

‘అఖండ-2’ నిర్మాతలు, బుక్ మై షో సంస్థపై హైకోర్టు ఆగ్రహించింది. ‘కోర్టు ఉత్తర్వులంటే లెక్క లేదా? పెంచిన ధరలతో టికెట్లు ఎందుకు విక్రయించారు?’ అని ప్రశ్నించింది. తమకు ఉత్తర్వులు అందేలోపే ప్రేక్షకులు టికెట్లు బుక్ చేసుకున్నారని BMS నిర్వాహకులు కోర్టుకు తెలిపారు. అటు ధరల పెంపు GO రద్దుపై ఈ మూవీ నిర్మాతలు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై కాసేపట్లో విచారణ జరగనుంది.

News December 12, 2025

కోర్టులపై SMలో తప్పుడు విమర్శలు చేస్తే కఠినంగా ఉంటా: CJI

image

విచారణలో జడ్జిలు చేసే కామెంట్లపై SMలో తప్పుడు విమర్శల పట్ల CJI సూర్యకాంత్ ఆందోళన వ్యక్తపరిచారు. ఇలాంటి వాటిపై కఠినంగా ఉంటానని స్పష్టం చేశారు. ఇరువైపుల వాదనల బలాన్ని గుర్తించేందుకే జడ్జిలు వ్యాఖ్యలు చేస్తారని, అవే తుది నిర్ణయం కాదన్నారు. ట్రయల్ కోర్టు జడ్జి వ్యాఖ్యలు పక్షపాతంతో ఉన్నాయని, తనపై రేప్ కేసును బదిలీ చేయాలని కర్ణాటక EX MP ప్రజ్వల్ వేసిన పిటిషన్ విచారణలో CJI ఈ అంశాలు ప్రస్తావించారు.

News December 12, 2025

వైవాహిక అత్యాచారం నేరమే: శశి థరూర్

image

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా చూడకపోవడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని కాంగ్రెస్ నేత శశి థరూర్ అన్నారు. భార్యపై భర్త అత్యాచారాన్ని నేరంగా పరిగణించని దేశాలలో భారత్ ఒకటని తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్టు చెప్పారు. కఠినమైన అత్యాచార చట్టాలు అమలులో ఉన్నా భర్తలకు మినహాయింపు దారుణమని కోల్‌కతాలో FICCI లేడీస్ ఆర్గనైజేషన్‌తో కలిసి ప్రభా ఖైతాన్ ఫౌండేషన్ నిర్వహించిన ప్రోగ్రామ్‌లో ఇలా వ్యాఖ్యానించారు.