News January 3, 2025
తల్లికి వందనం అమలుపై మంత్రి క్లారిటీ

AP: ఈ ఏడాది జూన్ 15లోగా తల్లికి వందనం స్కీమ్ను అమలు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాలపై వైసీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో వేర్హౌస్ కార్పొరేషన్ గిడ్డంగులను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఏటా రూ.15,000 చొప్పున అందిస్తామని కూటమి నేతలు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News December 29, 2025
అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె

అన్నమయ్య జిల్లా విభజన విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అన్నమయ్య జిల్లా పేరు యథావిధిగా కొనసాగుతుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. జిల్లా కేంద్రంగా మదనపల్లె ఉంటుందని స్పష్టం చేశారు. తప్పని పరిస్థితుల్లో రాయచోటిని మార్చాల్సి వచ్చిందని చెప్పారు. మొత్తంగా పుంగనూరు, తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, రాయచోటితో అన్నమయ్య జిల్లా కొనసాగనుంది. ఈ మార్పులు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి.
News December 29, 2025
భారత ప్రభుత్వానికి లలిత్ మోదీ క్షమాపణ

పరారీలో ఉన్న IPL ఫౌండర్ లలిత్ మోదీ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. ఇటీవల విజయ్ మాల్యాతో కలిసి చేసిన <<18679569>>వీడియో<<>>పై తీవ్ర విమర్శలు రావటంతో స్పందించారు. ‘ఎవరి ఫీలింగ్స్నైనా గాయపర్చి ఉంటే క్షమించాలి. ముఖ్యంగా భారత ప్రభుత్వం పట్ల నాకు చాలా గౌరవం ఉంది. నా వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు’ అని Xలో పోస్ట్ చేశారు. వాళ్లను భారత్కు తీసుకొచ్చేందుకు కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
News December 29, 2025
వాహనదారులకు అలర్ట్!

మొబైల్ నంబర్ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని వాహన యజమానులు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లను కేంద్ర రవాణా శాఖ అలర్ట్ చేసింది. చాలామంది పాత నంబర్లను మార్చకపోవడంతో చలాన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ వంటి కీలక సమాచారం పొందలేకపోతున్నారని పేర్కొంది. వాహనదారులు Vahan, సారథి పోర్టల్స్లో మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. <


