News March 7, 2025
‘తులం బంగారం’ హామీ అమలుపై మంత్రి క్లారిటీ

TG: ‘కళ్యాణ లక్ష్మీ’ పథకంలో భాగంగా తులం బంగారం ఇస్తామన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మందగించడంతోనే దీనిని అమలు చేయడం ఆలస్యమవుతోందని తెలిపారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని, ఇప్పటికే పలు హామీలను నెరవేర్చామని పేర్కొన్నారు.
Similar News
News February 3, 2026
వెంటిలేటర్ కావాలంటే NIMSలో సిఫార్సు ఉండాల్సిందే

నగరంలో ప్రముఖ ఆస్పత్రి NIMSలో అత్యవసర పరిస్థితుల్లో వెంటిలేటర్ సేవలు కావాలంటే దొరకదు.. ప్రముఖులతో చెప్పించుకుంటే కానీ అక్కడ ఎమర్జెన్సీ వెంటిలేటర్ దొరకదు. నిమ్స్ ఎమర్జెన్సీలో దాదాపు 100 వెంటిలేటర్లు ఉంటే 8- 10 వరకు ఎప్పుడూ మరమ్మతులో ఉంటాయి. ఒక్కోసారి పేషెంట్లు అంబులెన్సుల్లోనే గంటల తరబడి వేచి చూడాల్సిన దారుణ పరిస్థితులు ఉన్నాయని చికిత్సకు వచ్చిన వారు వాపోతున్నారు. ఈ దుస్థితి ఎప్పుడు మారుతుందో?
News February 3, 2026
రూ.600 కోట్లతో క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం: సత్యకుమార్ యాదవ్

AP: క్యాన్సర్ రోగులకు ఏటా రూ.600 కోట్లతో ఉచిత వైద్యం అందిస్తున్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘క్యాన్సర్ నియంత్రణకు మరిన్ని చర్యలు చేపడుతున్నాం. క్యాన్సర్ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి వైద్యం అందిస్తున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికోసం పాలియేటివ్ కేర్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం. 23 సెకండరీ ఆసుపత్రుల్లో డే కేర్ కీమో థెరఫీ సెంటర్లను నెలకొల్పుతున్నాం’ అని మంత్రి వివరించారు.
News February 3, 2026
క్రేజీ కాంబో.. ధురంధర్ డైరెక్టర్తో అల్లు అర్జున్ మూవీ?

‘ఉరి’, ‘ధురంధర్’ ఫేమ్ ఆదిత్య ధర్ డైరెక్షన్లో అల్లు అర్జున్ నటించబోతున్నట్లు టాక్. ఆదిత్య తన కలల ప్రాజెక్ట్ను బన్నీకి వినిపించగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ధురంధర్-2 మార్చిలో రిలీజైన తర్వాత ఈ భారీ పాన్ ఇండియా మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అట్లీ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ ఓ మూవీ చేస్తుండగా.. లోకేశ్, త్రివిక్రమ్తోనూ సినిమాలు కమిట్ అయినట్లు సమాచారం.


