News September 2, 2024

వాళ్ల గురించి మంత్రులు బాధపడొద్దు.. మీరు బాగా పనిచేశారు: రేవంత్

image

TG: కొన్ని మీడియా ఛానెళ్లు ఏదో రాస్తున్నాయని ఖమ్మం జిల్లా మంత్రులు బాధపడొద్దని CM రేవంత్ రెడ్డి అన్నారు. ‘మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి అర్ధరాత్రి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నారు. అది నేనూ చూశా. వాళ్లెవరో ఏదో రాశారని మీరు పట్టించుకోవాల్సిన పనిలేదు. నేను ఆశించినదాని కంటే ఎక్కువ ప్రజలకు పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని ఖమ్మం ప్రెస్‌మీట్‌లో అన్నారు.

Similar News

News March 10, 2025

కెప్టెన్‌గా రోహిత్ శర్మ గెలిచిన ట్రోఫీలు ఇవే

image

☞ IPL: 2013, 2015, 2017, 2019, 2020 (MI)
☞ CL టీ20: 2013
☞ ఆసియా కప్: 2018, 2023
☞ నిదహాస్ ట్రోఫీ-2018
☞ టీ20 వరల్డ్ కప్-2024
☞ ఛాంపియన్స్ ట్రోఫీ-2025

News March 10, 2025

NZ అంటే చాలు.. రెచ్చిపోతాడు!

image

వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌పై భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటివరకు ఆ జట్టుపై శ్రేయస్ వరుసగా 103, 52, 62, 80, 49, 33, 105, 79, 48 రన్స్ చేశారు. అలాగే ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక పరుగులు (243) చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పారు. ఈ టోర్నీలో ఆయన 15, 56, 79, 45, 48 రన్స్ సాధించారు.

News March 9, 2025

భారత జట్టుకు అభినందనల వెల్లువ

image

ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టుకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు, తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. టీమ్ ఇండియా మరోసారి తన సత్తా చాటిందని, గర్వపడేలా చేసిందని AP సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, మంత్రులు సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు.

error: Content is protected !!