News March 31, 2025
అరుణాచల్ ప్రదేశ్లో స్వల్ప భూకంపం

ఇవాళ మధ్యాహ్నం 2.38 గంటలకు అరుణాచల్ ప్రదేశ్లోని షియోమీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనలకు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇటీవల మయన్మార్, థాయ్లాండ్ సహా భారత్లోని మేఘాలయ, కోల్కతా, ఢిల్లీలోనూ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
Similar News
News November 21, 2025
సంగారెడ్డి: ఏ గ్రామంలో ఏ రిజర్వేషన్ వస్తుందో..?

ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావడంతో గ్రామాల్లో మళ్లీ రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. రిజర్వేషన్లు మారే అవకాశం ఉండడంతో ఏ గ్రామాల్లో మళ్లీ ఏ రిజర్వేషన్ వస్తుందోనని నాయకుల్లో ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,613 పంచాయతీలు ఉండగా 14,170 వార్డులు ఉన్నాయి.
News November 21, 2025
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు: R.కృష్ణయ్య

రిజర్వేషన్ల పేరిట BCలను TG ప్రభుత్వం మోసం చేస్తోందని BC నేత, MP R.కృష్ణయ్య మండిపడ్డారు. ‘పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎలా ఇస్తారు? కోర్టు తీర్పు వచ్చే వరకూ ఎలక్షన్స్ వాయిదా వేయాలి. ఓటు చోరీపై పార్లమెంటులో ఆందోళనలు చేసిన ఇండీ కూటమి MPలు.. BC రిజర్వేషన్లపై ఎందుకు నిరసన చేపట్టలేదు? వారు ఆందోళనలు చేస్తే PM స్పందించి BCలకు మేలు చేసేవారు’ అని వ్యాఖ్యానించారు.
News November 21, 2025
7 సినిమాలు.. అనుపమ అరుదైన ఘనత

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అరుదైన ఘనత సాధించారు. ఈ ఏడాది ఆమె 3 భాషల్లో నటించిన 6 చిత్రాలు విడుదలవగా DEC 5న ‘లాక్డౌన్’ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ తరం కథానాయికల్లో ఈ ఫీట్ సాధించిన తొలి దక్షిణాది నటిగా నిలిచారు. అనుపమ నటించిన డ్రాగన్, బైసన్, కిష్కింధపురి మంచి విజయాలు సాధించగా, పరదా, జానకిvsస్టేట్ ఆఫ్ కేరళ, పెట్ డిటెక్టివ్ ఫర్వాలేదనిపించాయి. ఆమె తెలుగులో శర్వానంద్ సరసన భోగి మూవీలోనూ నటిస్తున్నారు.


