News March 31, 2025
అరుణాచల్ ప్రదేశ్లో స్వల్ప భూకంపం

ఇవాళ మధ్యాహ్నం 2.38 గంటలకు అరుణాచల్ ప్రదేశ్లోని షియోమీలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 3.5గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. భూప్రకంపనలకు భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు. ఇటీవల మయన్మార్, థాయ్లాండ్ సహా భారత్లోని మేఘాలయ, కోల్కతా, ఢిల్లీలోనూ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.
Similar News
News November 13, 2025
వరల్డ్ లాంగెస్ట్ మ్యారీడ్ కపుల్ వీరే..

అత్యధిక కాలంగా దాంపత్య జీవితం సాగిస్తున్న జంటగా అమెరికాకు చెందిన ఎలీనర్(107), లైల్ గిట్టెన్స్(108) ప్రపంచ రికార్డ్ సృష్టించారు. 1942లో వీరికి వివాహం కాగా 83ఏళ్లుగా అన్యోన్యంగా జీవిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈక్రమంలోనే ఓల్డెస్ట్ లివింగ్ కపుల్గానూ ఖ్యాతి గడించారు. వీరి కంటే ముందు బ్రెజిల్ జంట మనోయల్, మరియా అత్యధిక కాలం(85ఏళ్లు) వైవాహిక జీవితం గడిపిన కపుల్గా రికార్డుల్లోకెక్కారు.
News November 13, 2025
షమీని ఎందుకు తీసుకోవట్లేదు? గిల్ సమాధానమిదే

షమీ లాంటి బౌలర్లు చాలా తక్కువ మంది ఉంటారని IND టెస్ట్ కెప్టెన్ గిల్ అన్నారు. ఆయన్ను ఎందుకు సెలక్ట్ చేయలేదు, ఫ్యూచర్లో చేస్తారా అనే ప్రశ్నలకు తనకంటే సెలక్టర్లే బెటర్గా సమాధానం ఇవ్వగలరని ప్రెస్ కాన్ఫరెన్స్లో పేర్కొన్నారు. ప్రస్తుతమున్న బౌలర్లు చాలా బాగా రాణిస్తున్నారని గుర్తుచేశారు. SAతో జరగనున్న తొలి టెస్టులో ఆల్రౌండర్ లేదా ఎక్స్ట్రా స్పిన్నర్ను ఆడించే విషయంపై రేపే నిర్ణయం తీసుకుంటామన్నారు.
News November 13, 2025
రాష్ట్రంలో 107 ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

ఏపీ మెడికల్ &హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆయూష్ విభాగంలో 107 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. పోస్టును బట్టి డిగ్రీ, MBA, M.COM, CA, ICWA, MD, BAMS, BHMS, BUMS, BNYS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, BC, EWSలకు రూ.750. వెబ్సైట్: https://apmsrb.ap.gov.in/


