News September 23, 2024
మైనారిటీల పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలి: CM

AP: ముస్లిం మైనారిటీలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు బేరీజు వేసుకోవాలని సూచించారు. మైనారిటీ సంక్షేమంపై సచివాలయంలో మంత్రి ఫరూక్, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
Similar News
News November 12, 2025
CWCలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్(CWC) 11 కాంట్రాక్ట్ యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈనెల 25వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLB/LLM, MBA/PGDM, MSc(స్టాటిస్టిక్స్), BSc(స్టాటిస్టిక్స్), BBA, ఎంటెక్, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
News November 12, 2025
విడాకుల వార్తలకు చెక్ పెట్టిన శర్వానంద్!

టాలీవుడ్ హీరో శర్వానంద్, ఆయన భార్య రక్షిత విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇన్డైరెక్ట్గా చెక్ పెట్టారు. ‘తండ్రి అయ్యాకే ఆరోగ్యంపై దృష్టి పెట్టా. అంతకుముందు వర్కౌట్స్ చేసేవాడిని కాదు. నా కుటుంబం కోసం ఆరోగ్యంగా, స్ట్రాంగ్గా ఉండాలని డిసైడయ్యా’ అని పేర్కొన్నారు. 2019లో యాక్సిడెంట్ తర్వాత తన బరువు 92kgsకి పెరిగిందని, కష్టపడి 22kgs తగ్గానన్నారు.
News November 12, 2025
రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు: PCC చీఫ్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ రిగ్గింగ్కు పాల్పడిందన్న BRS ఆరోపణలను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తిప్పికొట్టారు. ‘రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు. ఇది పాత జమానా కాదు. BRS వాళ్లు ఓడిపోతున్నామనే బాధలో మాట్లాడుతున్నారు. మళ్లీ మేమే వస్తాం. హైకోర్టు ఆదేశాల మేరకు స్థానిక ఎన్నికలపై ముందుకు వెళ్తాం. క్యాబినెట్ విస్తరణ సీఎం, అధిష్ఠానం చూసుకుంటుంది’ అని మీడియాతో చిట్చాట్లో తెలిపారు.


