News September 23, 2024

మైనారిటీల పథకాలను రీ స్ట్రక్చర్ చేయాలి: CM

image

AP: ముస్లిం మైనారిటీలకు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పథకాలు రీ స్ట్రక్చర్ చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు, ఎన్నికల్లో ప్రకటించిన హామీలు బేరీజు వేసుకోవాలని సూచించారు. మైనారిటీ సంక్షేమంపై సచివాలయంలో మంత్రి ఫరూక్, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.

Similar News

News October 15, 2025

భూ సేకరణ ప్రకటనలు వెంటనే జారీ చేయాలి: కలెక్టర్

image

పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా భూమికి భూమి, కాలనీల నిర్మాణాలు, సెల్ ఫోన్ నెట్వర్క్ టవర్ల ఏర్పాటు తదితర పనులకు జిల్లాలో 4,434 ఎకరాల భూమి అవసరం ఉందని కలెక్టర్ వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. ఇప్పటికే బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి మండలాలలో గుర్తించిన భూములకు సంబంధించి ఇంకా సేకరణ చేయాల్సిన భూములకు సంబంధించి భూసేకరణ ప్రకటనలు వెంటనే జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు.

News October 15, 2025

ప్రభుత్వానికి ఆస్తి రాసిచ్చి.. కొడుకుకు తండ్రి గుణపాఠం!

image

TG: తన బాగోగులు చూసుకోని కొడుకుకు సరైన గుణపాఠం చెప్పాడా తండ్రి. హన్మకొండ(D) ఎల్కతుర్తి మాజీ MPP శ్యాంసుందర్ రూ.3Cr విలువైన మూడెకరాల భూమిని ప్రభుత్వానికి రాసిచ్చారు. ప్రభుత్వ స్కూల్/ కాలేజీ కట్టి తన భార్య పేరు పెట్టాలని కోరారు. భార్య మరణించినప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్న ఆయనను కొడుకు రంజిత్ రెడ్డి చేరదీయలేదు. పైగా కొంత ఆస్తి తన పేరిట రాయించుకొని దాడి చేశారు. దీంతో శ్యాంసుందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

News October 15, 2025

ఆవు పేడతో నెలకు రూ.25వేల ఆదాయం

image

జీవితంలో ఎదగాలనే తపన ఉంటే ఆవు పేడతోనూ అద్భుతాలు చేయొచ్చని నిరూపిస్తున్నారు మధ్యప్రదేశ్‌ సాగర్ ప్రాంత మహిళలు. పేడతో కుందులు, బొమ్మలు, ల్యాంప్స్, గోడ గడియారాల లాంటివి తయారు చేసి విక్రయిస్తున్నారు. కొన్ని వస్తువులను విదేశాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా సగటున ₹25K వరకు సంపాదిస్తున్నారు. పండుగ సమయాల్లో ఈ మొత్తం ₹80వేలకు చేరుతోంది.
* రోజూ మహిళల స్ఫూర్తిదాయక కథనాల కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.