News December 17, 2024
అద్భుతం: కార్తీక దీపాల మధ్యలో ఆదియోగి వైభవం

తమిళనాట కార్తీక దీపం వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కోయంబత్తూర్లోని ఇషా యోగా ఫౌండేషన్లో భక్తులు లక్ష దీపాలను వెలిగించారు. ఈక్రమంలో ఆ ప్రాంగణమంతా దివ్యజ్యోతులతో ధగధగలాడింది. ఆదియోగి రూపాన్ని చూస్తూ భక్తులు తన్మయత్వంతో శివనామస్మరణ చేశారు.
Similar News
News October 22, 2025
అందుకే అలా మాట్లాడా: నిర్మాత రాజేశ్

నిన్న ఓ వెబ్సైట్పై <<18065234>>ఫైరయిన<<>> ‘K RAMP’ నిర్మాత రాజేశ్ దండా తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ‘రేటింగ్ ఇవ్వడంపై అభ్యంతరం లేదు. కానీ ఆదరణ పెరిగాక నెగటివ్ వార్తలు రాయడం బాధించింది. నేను వాడిన భాష అభ్యంతరకరం అంటున్నారు. రూ.కోట్లు ఖర్చుచేసిన నా సినిమాను చంపేసే ప్రయత్నం చేస్తుంటే కోపం రాదా.. నేనూ మనిషినే కదా. అందుకే అలా మాట్లాడా. సినీ జర్నలిస్టులంటే నాకు ఎప్పుడూ గౌరవమే’ అని ట్వీట్ చేశారు.
News October 22, 2025
కేటీఆర్, హరీశ్రావుతో కేసీఆర్ సమీక్ష

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్రావుతో సమావేశమయ్యారు. ఎర్రవల్లి ఫాంహౌస్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై సమీక్షిస్తున్నారు. పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా వ్యూహం, ప్రచార సరళి గురించి ఆయనకు కేటీఆర్, హరీశ్రావు వివరిస్తున్నారు. రేపు జరగనున్న బీఆర్ఎస్ ఇన్ఛార్జుల సమావేశంపైనా చర్చిస్తున్నట్లు సమాచారం.
News October 22, 2025
542 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(BRO) 542 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వెహికల్ మెకానిక్, MSW(పెయింటర్, DES)పోస్టులు ఉన్నాయి. టెన్త్, ITI అర్హతగలవారు నవంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. PET, ట్రేడ్ టెస్ట్/స్కిల్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bro.gov.in/