News September 12, 2025
ఈ ఓటీటీలోనే ‘మిరాయ్’ స్ట్రీమింగ్

టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ నటించిన పాన్ ఇండియా ఫాంటసీ చిత్రం ‘మిరాయ్’ OTT హక్కులను జియో హాట్స్టార్ దక్కించుకుంది. 6 నుంచి 8 వారాల థియేటర్ స్క్రీనింగ్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వొచ్చని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండనుందని ‘మిరాయ్’ మూవీ ఎండ్ కార్డులో ప్రకటించారు. ‘జైత్రయ’ అనే టైటిల్ను వెల్లడించగా ఇందులో నటుడు రానా విలన్గా నటిస్తారని టాక్ వినిపిస్తోంది.
Similar News
News March 7, 2026
సెంటిమెంట్.. హోటల్ను మార్చిన టీమ్ఇండియా

T20 WC విజేతగా నిలిచేందుకు టీమ్ఇండియా ప్రతి అంశంలోనూ జాగ్రత్తలు తీసుకుంటోంది. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని దృష్టిలో ఉంచుకొని, సెంటిమెంట్ పరంగా ఆ టైమ్లో బస చేసిన ITC నర్మదలో కాకుండా తాజ్ స్కై లైన్కు బస మార్చేసింది. అహ్మదాబాద్లో రేపు న్యూజిలాండ్తో ఫైనల్ జరగనుండగా చివరి నిమిషంలో ఈ నిర్ణయం తీసుకుంది. అటు ఇటీవల చంద్రగ్రహణం టైమ్లోనూ జట్టు ప్రాక్టీస్కు ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే.
News March 7, 2026
సర్కారు బడి పిల్లలకు గుడ్ న్యూస్.. వారానికో రోజు ఫిష్!

TG: ప్రభుత్వ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలో కీలక మార్పులు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు మరింత పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం ఇస్తున్న చికెన్ స్థానంలో వారానికి ఒకరోజు చేపలను చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. 99 రోజుల ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఈ కొత్త మెనూ అమలు చేసే అవకాశం ఉంది. ఒక వారం చికెన్, మరో వారం చేపలు అందించేలా ప్రత్యామ్నాయ మార్గాలనూ అధికారులు పరిశీలిస్తున్నారు.
News March 7, 2026
గుడ్న్యూస్.. వారికి వేతనాలు పెంపు!

AP: జలవనరుల శాఖలో ఔట్సోర్సింగ్ విధానంలో పని చేసే లస్కర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. రోజు వారీగా ఇస్తున్న ₹350ని ₹550కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా నిర్ణయంతో లస్కర్లకు ఒక్కొక్కరికి నెలకు రూ.6 వేల వరకు జీతం పెరిగింది. సాగునీటి కాలువలు, తూముల నుంచి నీటి విడుదల, షట్టర్ల మూత, నిర్వహణ, లీకేజీల గుర్తింపు, మరమ్మతు పనులు, పహారా వంటివి లస్కర్లు చూసుకుంటారు.


